తెలంగాణ వెబ్ న్యూస్; ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసింది...ఇక్కడి ప్రజల అసంతృప్తి..ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేని ఏపీ పట్ల కేంద్రం ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నిస్తున్నారు.ఎంతో నమ్మకంతో టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించిన ఏపీ ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసింది. ఇదెక్కడి న్యాయం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి
వ్యక్తం చేశారు.శనివారం అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీసుకోన్న నిర్ణయానికి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజనసాధ్యమైందని,విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో బీజేపీకీ పూర్తి బాధ్యత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పొరుగునే బెంగుళూరు,చేన్నై,హైదరాబాద్ వంటి మహానగరాలు ఉన్నాయి. కొత్తగా మేం నిర్మించుకోబోయే రాజధాని ఆదాయం,ఉపాధి కల్పన లో వాటితో పోటీపడాలి.
No comments:
Post a Comment