తెలంగాణ వెబ్ న్యూస్;ఖమ్మం జిల్లా కొత్త గూడెంలో జరుగుతున్న సైనిక ఎంనికల్లో భాగంగా ఆదివారం సోల్జర్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాల కోసం మూడున్నరవేల మంది హాజరయ్యారు. అందులో 2,756 మంది సోమవారం జరిగే పరుగు పరీక్షకు అర్హులుగా నిలిచారు.అయితే ఈ నెల 6వతేదీ నుంచి 8 వరకు నిర్వహించిన సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగానికి అధిక సంఖ్యలో అభ్యర్థులు అర్హతను సాధించడం వివేషం.సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగానికి వివిధ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి పదివేల మందికి పైగా అభ్యర్థులు హాజరుకాగా పరుగు పరీక్షను అదిగమించి 1,481 మంది వైద్య పరీక్షలకు అర్హత పందారు.ఆదివారం జరిగిన సైనిక ఎంపికల ప్రక్రియను నియామకాల ఉపసంచాలకులు జనరల్ (చెన్నై) సంగ్రం దాల్వి పరిశీలించారు.
No comments:
Post a Comment