తెలంగాణ వెబ్,న్యూస్;బంగరు తెలంగాణ లక్ష్య సాధనకు అవిరళ కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో తాను పనిచేస్తానని రాష్ట్ర అభ్యున్నతికి శ్రమిస్తానని ప్రభుత్వ పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివస్ గౌడ్ తెలిపారు.
Wednesday, 31 December 2014
నూతన సంవత్సర వేడుకల్లో 35,మంది మృతి
తెలంగాణ వెబ్,న్యూస్;నూతన సంవత్సర వేడుకలు చైనాలో పెను విషాదం మిగిల్చాయి.షాంఘైలోని వాటర్ ఫ్రంట్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా,42 మందికి పైగా గాయాలయ్యాయి.
లక్ష్యం నెరవేర్చని ‘సర్దుబాటు’
తెలంగాణ వెబ్,న్యూస్;విజయనగరం పట్టణంలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు.తాజాగా చేపట్టిన సర్ధుబాటులో అధనంగా ఉపాధ్యాయుడిని ఇస్తారని ఆశించారు.అయితే నిరాశే మిగిలింది.ఇలా జిల్లా వ్యాప్తంగా పలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.
నేటి అర్థరాత్రి వరకూ మద్యం అమ్మకాలు
తెలంగాణ వెబ్,న్యూస్;నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని బుధవారం అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆబ్కారీ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు.మంగళవారం ఆయన 'ఈనాడు'తో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. కొత్త ఏడాది మద్యం ప్రియుల సౌకర్యార్థం దుకాణాలకు 12 గంటల వరకు,బార్లు ఒంటిగంట వరకు అమ్మకాలు సాగించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
జనవరి లో కొత్త వేతనం
తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా జనవరి మూడోవారంలో వేతన సవరణను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.ఉద్యోగులు 99.9 శాతం సంతృప్తిపడే రీతిలో జీతాల పెంపు ఉంటుందని వారి కరతాళధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు.తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) సంఘం రూపొందించిన 2015 దైనందిని,కాలమానిని మంగళవారం రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.
సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షలు వాయిదా
తెలంగాణ వెబ్,న్యూస్;వచ్చే నెల నాలుగున నిర్వహించాల్సిన ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్లు కోరుకొండ సైనికస్కూల్ ప్రిన్సిపాల్,గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 విద్యా సంవత్సరానికి జనవరి 4న జరగాల్సిన ప్రవేశ పరీక్షలు 2015 ఫిబ్రవరి 22కి వాయిదా పడినట్లు ఆయున తెలిపారు.
Tuesday, 30 December 2014
11 కేంద్రాల్లో సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షలు
తెలంగాణ వెబ్,న్యూస్;ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కోరుకొండ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్,గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 సంవత్సరానికి సైనిక పాఠశాలల్లో ఆరు,తిమ్మిది తరగతుల్లో ప్రవేశానికి వచ్చే నెల 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
Monday, 29 December 2014
సీఎం కేసీఆర్ ఇంటికి జస్టిస్ ఎన్వీ రమణ
తెలంగాణ వెబ్,న్యూస్;సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సోమవారం ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు,మంత్రి కేటీఆర్,ఆయన భార్య శ్తెలిమ, కేసీఆర్ కుమారై,ఎంపీ కవితలు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.పట్టు వస్త్రాలతో సత్కరించారు.
జాతీయ స్థాయి నగరంగా
తెలంగాణ వెబ్,న్యూస్;వరంగల్ ను జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని,అక్కడ ఏర్పాటు చేస్తున్న జౌళి ఉత్పత్తుల కేంద్రంలో భాగంగా రూ.రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని తీసుకొస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు.టెక్స్ టైల్ పార్కు,వలయ రహదారి (రింగురోడ్డు),నగరంలో మౌలిక వసతులు,కాకతీయ ఉత్సవాలపై సమీక్ష కోసం సోమవారం ఆయన వరంగల్ కు వచ్చారు.
పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ వెబ్,న్యూస్;మండల పరిధిలోని ఇన్ముల్ నర్వ వెంకటేశ్వర విద్యాలయ యాజమాన్యం విద్యార్థుల వద్ద ఆదిక ఫీజులు వసూలు చేస్తోందని ఇన్ముల్ నర్వ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఆంతేకాకుండా విద్యార్థుల పై తీవ్రమైన వత్తిడి తెస్తున్నారని వివరించారు.దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇస్తున్నారని తెలిపారు.
ఆసక్తితో చదివితే జీవితాంతం గుర్తుంటాయి
తెలంగాణ వెబ్,న్యూస్;ఆసక్తితో చదివిన విషయాలు జీవితాంతం గుర్తుంటాయని తెలుగు పండితుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాధాకృష్ణ విద్యార్థులకు సూచించారు.మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ రాయికల్ లో వ్యక్తిత్వ వికాసం,పాఠ్యాంశాలను గుర్తించుకునే విధానాలపై విద్యార్థులకు ఆవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాలపై పట్టుసాధించేందుకు తీసుకొవాల్సిన చర్యలు,పరీక్షలంటే భయాన్ని తొలగించే విధానాలను, ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను జప్తికి ఉంచుకునే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కేసీఆర్ పాలన గాడి తప్పింది;నాగం
తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ పై భాజపా సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేసీఆర్ పాలన గాడి తప్పిందని ...ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఒకవైపు రైతులకు,మరోవైపు ప్రజలకు శాపంగా మారుతున్నాయన్నారు.గాలిలో తిరుగుతూ....గాలి మాటలతో ప్రజలను వూహల్లో విహరింపచేస్తున్నారనిమండిపడ్డారు.
తెలంగాణ లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి; డీజీపీ
తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది 68 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు.
కేసీ ఆర్ భూమ్మీద నడిచి సమస్యలు తెలుసుకోవాలి
తెలంగాణ వెబ్,న్యూస్;సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలు మాని భూమ్మీద తిరిగుతూ ప్రజల రైతుల సమస్య భాజపా సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.పట్టణంలో ప్రభుత్వ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు.మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మూసివేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇవేవీ పట్టించుకోకుండా కేసీఆర్ఏరియల్ సర్వేలతో కాలం గడుపుతున్నారన్నారు.
విలీన విద్యపై అవగాహన కల్పించాలి
తెలంగాణ వెబ్,న్యూస్;జిల్లాలోని వికలాంగులకు,వారి తల్లిదండ్రులకు భవిత విద్యా వనరుల కేంద్రాల ద్వారా అందిస్తున్న విలీన విద్య పై అవగాహన కల్పించాలని డీఈవో రాజేశ్ తెలిపారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఈడీ కళాశాల సమావేశ మందిరంలో విలీన విద్యావనరుల కేంద్రాల ఐఈ ఉపాధ్యాయులకు నిర్వహించిన కార్యక్రమంలో డీఈవో మాట్లాడారు.మండలాలో క్రమం తప్పకుండా ఫిజియోథెరపి శిబిరాలు నిర్వహించాలని ,ముఖ్యంగా ఇంటివద్ద విద్యను తప్పకుండా ఆందించాలన్నారు.వికలాంగులు అన్ని రంగాల్లో రాణించేలా,సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకునేలా కృషి చేయాలన్నారు.వైకల్యం ఏవిధంగా వస్తుంది.దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు,వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు,తదితర అంశాలపై వికలాంగుల తల్లిదండ్రులకు ఆవగాహన కల్పించాలన్నారు.
Sunday, 28 December 2014
ఘనంగా పీజేఆర్ 7వ వర్ధంతి...
పీజేఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్...
పీజేఆర్ లాంటి నాయకుడి మల్లీ తెలంగాణలో పుట్టాలి: పొన్నాల
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: పీజేఆర్ లాంటి నాయకుడు మల్లీ జన్మంటూ పుడితే తెలంగాణలోనే పుట్టాలని తెలంగాణ టి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ సందర్బంగా పీజేఆర్ 7వ వర్ధంతి వేడుకలను జరుపుకోవడాన్ని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నివాళులు ఘనంగా నివాళులు అర్పించారు. ఖైరతాబాద్ లో పీజేఆర్ విగ్రహానికి పీజేఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పీజేఆర్ కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి, కూతురు పి.విజయారెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలు పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అన్నధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ర్యాలీగా అభిమానులు తరలివచ్చారు.
పీజేఆర్ లాంటి నాయకుడి మల్లీ తెలంగాణలో పుట్టాలి: పొన్నాల
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: పీజేఆర్ లాంటి నాయకుడు మల్లీ జన్మంటూ పుడితే తెలంగాణలోనే పుట్టాలని తెలంగాణ టి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ సందర్బంగా పీజేఆర్ 7వ వర్ధంతి వేడుకలను జరుపుకోవడాన్ని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నివాళులు ఘనంగా నివాళులు అర్పించారు. ఖైరతాబాద్ లో పీజేఆర్ విగ్రహానికి పీజేఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పీజేఆర్ కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి, కూతురు పి.విజయారెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలు పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అన్నధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ర్యాలీగా అభిమానులు తరలివచ్చారు.
Saturday, 27 December 2014
పీజేఆర్ కు నివాళ్ళులర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ వెబ్,న్యూస్;పీజీఆర్ వర్థంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.ఖైరతాబాద్ లోని పీజేఆర్ నివాసానికి వచ్చిన కేసీఆర్ ,తెరాస నేతలు పీజేఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళులర్పించారు.
జనవరి 5,6 తేదీల్లో సీపీఎం జిల్లా మహాసభలు
తెలంగాణ వెబ్,న్యూస్;సీపీఎం జిల్లా మహాసభలు జనవరి5,6 తేదీల్లో జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్లు నగర కార్యదర్శి గోవర్థన్ తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహాసభలు కామారెడ్డిలో ఉంటాయని చెప్పారు.ప్రతీ మూడేళ్లకోసారి శాఖ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుగుతాయన్నారు.సమావేశంలో నగర కమిటీ సభ్యులు సిర్పలింగం,మధు,అనుసూజ,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Min.PRIT IS ATTENDING THE FOLLOING PROGRAMME... on today @2pm we conducting "T.SERP UNION RASHTRA SADASSU" &2015CALENDER Inaguration programme. At BALBAVAN,Public gardens,HYD. Plz come& make NEWS covarage. KTR Sir, TNGOs&political Leaders coming.. So provide yours time. Thanq sir. Gangareddy state.President TS.SERP.Employs Union
.
అన్నదాతలకు తెదేపా
తెలంగాణ వెబ్,న్యూస్;అప్పుల బాధలు భరించలేక తనపు చాలించిన రైతు కుటుంబాలకు తెదేపా ఆసరా ఇచ్చింది.తాము అండగా ఉన్నామని సమావేశంలో పాల్గొన్న నేతలు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చారు.నిజామాబాద్ లోని శివాజీనగర్ మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం తెదేపా జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.పార్టీ జిల్లా కన్వీనర్,ఎమ్మెల్సీ అరికొల నర్సారెడ్డి అధ్యక్షత వహించారు.
సినీ రంగానికి సహకారం
తెలంగాణ వెబ్,న్యూస్;హైదరాబాద్ లో సినిమా రంగం అభావృద్ధికి తెలంగాణ సర్కారు పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.సినిమా రంగ ప్రముఖులతో త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమ అభివృద్దికి సూచనలు కోరతామన్నారు.కొత్త ప్రభుత్వం కావడంతో వెంటనే ఈ రంగం పై దృష్టి సారించలేకపోయామని తెలిపారు.
తేది-27-12-2014 పత్రికా ప్రకటన వాటర్ గ్రిడ్ కొసం 1238 ఉద్యోగాల భర్తీ- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు మెత్తం 529 ప్రభుత్వ ఉద్యోగాలు మరియు 709 తాత్కాలిక ప్రాతిపాధికన భర్తీ తమ నిర్ణయం వాటర్ గ్రిడ్ పట్ల తమకున్న నిబద్ధతకి నిదర్శనన్నా మంత్రి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ కోసం 1238 కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈ ఉద్యోగాలతోపాటు అర్ డబ్యూఏస్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు అవరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తాము ఈ పోస్టుల ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. 2018 నాటికి తెలంగాణ ప్రజలకి రక్షిత తాగునీరు అందించడంమే లక్ష్యంగా పెట్టుకున్నతమ ప్రభుత్వం ఇందుకోసం వాటర్ గ్రిడ్ పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం వాటర్ గ్రిడ్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ అయిన అర్ డబ్యూఏస్ శాఖను బలోపేతం చేసేందుకు మెత్తం 529 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుని, వాటికి అనుమతులు పొందామన్నారు. వీటితోపాటు 709 మంది సీనీయర్ అస
.
Friday, 26 December 2014
తెలంగాణ కేబినెట్...మంత్రుల శాఖల వివరాలు
తెలంగాణ వెబ్,న్యూస్;మంత్రి వర్గ స్వరూపం
. మహమూద్ అలీ-ఉప ముఖ్యమంత్రి ,రెవెన్యూ శాఖ
.టి.రాజయ్య-ఉప ముఖ్యమంత్రి ,వైద్య,ఆరోగ్య శాఖ
.నాయిని నర్సింహారెడ్డి- హోంశాఖ
.ఈటెల రాజేందర్-ఆర్థిక,పౌరసరఫరాల శాఖ
.హరీశ్ రావు-భారీ నీటిపారుదల,శాసనసభ వ్యవహారాలు
.పోచారం శ్రీనివాస్ రెడ్డి- వ్యవసాయ శాఖ
.కేటీఆర్-ఐటీ,పంచాయతీ రాజ్
.టి.పద్మారావు-ఎక్సైజ్,శాఖ
(అదనపు బాధ్యతలు;క్రీడలు,యువజన సర్వీసులు)
.మహేందర్ రెడ్డి-రవాణాశాఖ
.జి.జగదీశ్ రెడ్డి-ప్రాధమిక,మాధ్యమిక,ఉన్నత,సాంకేతిక వివ్యాశాఖ
.జోగురామన్న-అటవీ,పర్యావరణ శాఖ
(అదనపు బాధ్యతలు;వెనుకబడిన తరగతుల సంక్షేమం)
.తుమ్మల నాగేశ్వరరావు-రహదారులు,భవనాలు,స్త్రీశిశు సంక్షేమం
.లక్ష్మారెడ్డి-విద్యుత్ శాఖ
.జూపల్లి కృష్ణారావు-పరిశ్రమలు,చేనేత,జౌళి,చక్కర శాఖ
.చందూలాల్-గిరిజన సంక్షేమం,పర్యాటక,సాంస్కృతిక శాఖ
.తలసాని శ్రీనివాస్ యాదవ్-వాణిజ్యపన్నులు,సినిమాటో గ్రఫీ
.ఇంద్రకరణ్ రెడ్డి- గృహనిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ
హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో నేడు కేసీఆర్
తెలంగాణ వెబ్,న్యూస్;హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గగనతల సరిశీలన చేయనున్నారు.రహదారులు,కూడళ్లు,అటవీ భూములను పరిశీలించనున్నారు. ఘట్ కేసర్ మండలం నారపల్లిలో అటవీ భూములను క్షేత్ర స్థాయిలో సీఎం పరిశీలించనున్నారు.
అబ్బురపడేలా హైదరాబాద్ అభివృద్ధి
తెలంగాణ వెబ్,న్యూస్;హైదరాబాద్ మహానగరం ఇలా ఉంటుందా అని అబ్బురపడేలా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.తక్కువ వ్యవధిలోనే అత్యద్భుత వసతులతో...పరాపూర్ణ విశ్వనగరంగా జంట నగరాలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో జీహెచ్ఎంపీ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద 303 కార్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత పాలకులు నగరాన్ని నాశనం చేశారని విమర్శించారు.
పాఠ్య పుస్తకాల గుట్టు రట్టు
తెలంగాణ వెబ్,న్యూస్;ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్నాయి.పాఠ్యపుస్తకాల ముద్రణశాఖ డైరెక్టరు నుంచి వచ్చిన ఆదేశాలను తారుమారు చేస్తూ 36 వేల పుస్తకాలను పశ్చిమబెంగాల్ కు (అక్కడి తెలుగు బడులకు) పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.జిల్లా విద్యాశాఖాధికారికి ఎలాంటి సమాచారం లేకుండా గోదాము ఇంఛార్జి ఈ తతంగానికి తెర లేపారు.సకాలంలో విషయం తెలుకున్న విద్యాశాఖ అధికారులు పుస్తకాల తరలింపును అడ్డుకొని,లారీలను గోదాములోనే ఉంచారు. ఈ తరలింపు వెనుకకొందరు రాష్ట్ర స్థాయి అధికారుల హస్తం ఉన్నట్లు సమాచారం.
నేడు,రేపు జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
తెలంగాణ వెబ్,న్యూస్;జిల్లాలోని ప్రభుత్వ భౌతిక రసాయన శాస్త్రం బోధిస్తున్న స్కూల్ ఆసిస్టెంట్ ఉపాధ్యాయులకు శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు పాఠ్యాంశాలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఫిజికల్ సైన్స్ ఫోరం నాయుకులు తెలిపారు.పురపాలిక పరిధిలోని చటాన్ పల్లిలోని వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలో ఈ తరగతులు ఉంటాయని తెలిపారు. శిక్షణకు వచ్చే ఉపాధ్యాయులను బస్టాండు నుంచి కళాశాలకు చేరవేసేందుకు వామనంతోపాటు భోజన సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు.
Thursday, 25 December 2014
చంద్రబాబు,కేసీఆర్ లవి వూకదంపుడు ఉపన్యాసాలు
తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు,కేసీఆర్ లు వూకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడుపుతున్నారనీ,ఆచరణకు సాధ్యం కానీ హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ విమర్శించారు.కొల్లేరును కొల్లగొట్టడంలో చేపల మాఫియాకు చంద్రబాబు ,జగన్మోహన్ రెడ్డిలు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వ.మెత్తారు.సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూమ్ భవన్ లో గురువారం విలుకరుల సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషాతో కలిసి మాట్లాడారు.ఇరు రాష్ట్రాలు కలిసి సయోధ్యతో ఉమ్మడిగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలనేకం ఉన్నాయి.అయితే ఇద్దరు వ్యక్తిగత అహంభావాలతో వెళ్తున్నారు.
కరెంటు కష్టాలు తీరుస్తా
తెలంగాణ వెబ్,న్యూస్;రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీరుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు.ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో రూ.7,500 కోట్ల వ్యయంతో సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప స్వాముల మృతి
తెలంగాణ వెబ్,న్యూస్;కడప జిల్లా దువ్వూరు సమీపంలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి(బైపాస్) పై ఉన్న వంతెన రక్షణ గోడను క్వాలిన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా ,మరో ముగ్గురు గాయపడ్డారు.మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులోని రాంనగర్ కు చెందిన బాలనారాయణ,దేవయ్య,రాజేందర్ రెడ్డి,శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు.నిరంజన్,పాండు,భగవంతుడు తీవ్రంగా గాయపడ్డారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ వెబ్, న్యూస్;తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ,దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ ఎన్నిక
తెలంగాణ వెబ్,న్యూస్;ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ ఎన్నికయ్యారు.ఈ రోజు ఉదయం రాంచీలో భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై రఘుబర్ దాసును శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఝార్ఖండ్ తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ చరిత్ర సృష్టించారు.రఘుబర్ దాస్ గతంలో ఝార్ఖండ్ ఉప ముఖ్యంమత్రిగా కూడా పనిచేశారు.
విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
తెలంగాణ వెబ్,న్యూస్;కుంగ్ పూలో ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బెల్ట్ గేడింగ్ పరీక్షలను మేధ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శనలతో ఆలరించారు.హెచ్ ఎం భక్తా వత్సల్ విద్యార్థులను ఆభినందించారు.శిక్షకుడు తాజొద్దీన్,కనకంయాదవ్,శ్రీను సమక్షంలో పరీక్షలు జరిగాయి.శ్రీకాంత్,ఆంజనేయులు,దామోదర్ యాదవ్ పాల్గొన్నారు.
విద్యార్థులకు కంటి పరీక్షలు
తెలంగాణ వెబ్,న్యూస్;పట్టణంలోని భాష్యం ఉన్నత పాఠశాలలో శారదావికార్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.డా.రామకృష్ణ,మహేష్ ఆధ్వర్యంలో కంటిపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపీణీచేశారు.ఆనంతరం దృష్టి లోపాల కారణాలపై విద్యార్థులకు ఆవగాహన కల్పించారు.కరస్పాండెంట్ యూనుఫ్,ఆడ్వైజర్ వెంకటరమణ,హెచ్ ఎం యూనుఫ్ పాల్గొన్నారు.
బజాజ్ ల్లో...మా నిపులే
తెలంగాణ వెబ్,న్యూస్;చేతిలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే సరిపోదు..పరిశ్రమల అవసరానికి తగిన నైపుణ్యాలు కావాలి.అప్పుడే మంచి ఉద్యోగావకాశాలు ఎదురొస్తాయి.లక్షల్లో జీతాలు అందుతాయి.మరి ఆ నిపుణుల్ని ఎవరు తయారు చేస్తారు.ఈ ప్రశ్నని బాలా త్రిపుర సుందరి ఐదేళ్ల క్రితమే తనకి తాను వేసుకొన్నారు.ఆ పని తనే ఎందుకు చేయాకూడదని ముందడగు వేశారు.
తెలంగాణ,ఏపీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఉదయం నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలకు భారీగా తరలివచ్చి ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు.
Wednesday, 24 December 2014
విద్యుత్తు కొండగా నల్గొండ
తెలంగాణ వెబ్,న్యూస్;రాష్ట్రంలో విద్యుత్తు సమస్యకు పరిష్కారంతో పాటు భారీగా పెట్టుబడుల సమీకరణ,ఉపాధి కల్పన లక్ష్యంతో నల్గొండ జిల్లాలో ఎన్టీపీసీ, తెలంగాణ జెన్ కోల ద్వారా 7600 మెగావాట్ల థర్మల్ విద్కుత్కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ నిర్ణయించారు.
బాలచందర్ కు ప్రముఖుల నివాళి
తెలంగాణ వెబ్,న్యూస్;దర్శక శిఖరం కె.బాలచందర్ కు ప్రముఖులు నివాళులర్పించారు.సూపర్ స్టార్ రజినీకాంత్,అలనాటి నటి కాంచన,హీరో అర్జున్,హీరో సూర్యా తండ్రి శివకుమార్,హీరోవిజయ్,నటుడు శుభలేక సుదాకర్,సంగీత దర్శకులు ఇళయరాజా,ఎఆర్ రెహమాన్,నటి కుష్బూ,దర్శకులు పి.వాసు,కేంద్రమంత్రి చిందబరం,ప్రముఖ పాత్రికేయులు చోరామస్వామి హాస్యనటుడు వివేక్ తదితరులు బాలచందర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
మూగబోయిన రుద్రవీణ
తెలంగాణ వెబ్ న్యూస్;భారతీయ చలన చిత్ర రంగంలో మరోచరిత్ర సృష్టించిన ఓ సినీ దిగ్గజం నేలకొరిగిసోయింది.ఓరుద్రవీణ మూగబోయింది...ఓ అంతులేని కథ ఇంతలోనే ముగిసి పోయింది.వెండి తెరపై సగటుమనిషి బతుకుచిత్రాన్ని అద్భుతంగా మలచడంలో అందెవేసిన దర్శక దిగ్గజం తెరమరుగైపోయింది.
Tuesday, 23 December 2014
ఈ రోజు మధ్యాహ్నం కె.బాలచందర్ అంత్యక్రియలు
తెలంగాణ వెబ్,న్యూస్;అనారోగ్యంతో కన్నుమూసిన దర్శక దిగ్గజం కె.బాలచందర్ అంత్యక్రియలు ఈరోజు తేది-24-12-2014రోజున మద్యాహ్నంబీసెంట్ నగర్ లోని శ్మశాన వాటికలో జరుగును.
Fwd: G. Venkataswamy passes away
born as poor man grown as leader of masses and made his mark in congress party who participated in 1969 Telangana agitation and guided later 2009 agitation for Telangana separate state. Known as kaka is no more.
Monday, 22 December 2014
జనవరి 15 నాటికి పదో తరగతి సిలబస్ పూర్తి
తెలంగాణ వెబ్,న్యూస్;పదో తరగతి సిలబస్ ను సనవరి 15 నాటికి పూర్తి చేయించి, గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆప్రకారం విద్యా బోధన సాగిస్తున్నట్టు యలమంచిలి డీప్యూటీ డీఈవో బి.లింగేశ్వరరెడ్డి చెప్పారు.సోమవారం మండలానికి వచ్చిన ఆయన మేడివాడ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు.యలమంచిలి డివిజన్ లో ప్రభుత్వ,ప్రైవేటు స్కూలల్లో ఈ ఏడాది 20 వేల మంది పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్టు చెప్పారు.గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలో జిల్లా ఉత్తీర్ణత శాతం90.8 శాతం సాధించామని తెలిపారు.ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
సంస్కృతుల నిలయం;కలెక్టర్
తెలంగాణ వెబ్,న్యూస్;భిన్న సంస్కృతులకు నిలయం మన భారతదేశమని,సాంస్కృతిక ప్రదర్శనలతోనే నాటి నాగరికత విశేషాలను తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రియదర్శిని,ఏజేసీ రాజారాం అన్నారు. ఆక్టేవ్-2014 పేరిట సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ కళాభవన్ లో నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాల జానపద కళారూపాల సంబరాలు అంబరాన్నంటాయి.కేంద్ర సాంస్కృతిక శాఖ,దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం,తంజావూరు,తెలంగాణ రాష్ట్ర భాషా,జిల్లాసాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా కళాకారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.
ఊపిరి ఆడకపోవడం
ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం ఈ స్థితిని వైద్యపరిబాషలో బ్రెత్ లెస్ నెస్లెదా డిస్నియా అని వ్యవహరిస్తారు.తీవ్రస్థాయిలో వ్యాయామం చేసినప్పుడు,చాలా వేగంగా పురుగెత్తినప్పుడు ఆరోగ్యవంతులు కూడా ఈ సమస్యకు లోనవుతూ ఉంటారు.అయితే ఏ కొద్ది పాటి శ్రమకు లోనైనా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే దానిని వెంటనే వైద్య సహాయం పొందాల్సిన పరిస్థితిగా గుర్తించాలి.
ప్రభుత్వ భూముల్లోనే టెక్స్టటైల్ పార్కు;కేసీఆర్
తెలంగాణ వెబ్,న్యూస్;ప్రభుత్వ బూముల్లోనే వరంగల్ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.అన్ని వస్త్ర ఉత్పత్తులు టెక్స్ టైల్ పార్కులో ఒకేచోట ఉండాలని ,సూరత్,షోలాపూర్ లో అధ్యయనం తర్వాత పార్కుకు తుది రూపుఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.
ఒకటో తరగతి నుంచే ప్రక్షాళన
తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ సర్కారు గురుకుల విద్యకు పెద్ద పీట వేయాలని యోచిస్తోంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పలు పథకాలు కింద నడుస్తున్న పాఠశాలలను క్రమంగా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి గురుకులాలుగా మార్చాలని భావిస్తోంది.ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కేజీ నుంచి పీజీ పథకాన్ని హడావుడిగా కాకుండా అందరితో చర్చించిన తర్వాత ఆచితూచి ప్రారంభించాలని నిర్ణయించింది.
health mobile app lanched by telangana govt
The Ministry of Medical, Health and Family Welfare, Government of Telangana is pleased to launch a dedicated App for the Ministry to facilitate access to its initiatives, provide public health information, locate health centers and also empower the citizens to track and record their health data through the Health Tools. The application is developed by the Healthcare Innovation Cell (HIC) of the Ministry of Health in collaboration with Mahindra Comviva. The application is available in both Telugu and English. The Ministry invites active participation from the community to utilize the App for healthier living and to keep track of their health.
Healthcare Innovation Cell (HIC)
Ministry of Medical, Health and Family Welfare
Government of Telangana, India
Healthcare Innovation Cell (HIC)
Ministry of Medical, Health and Family Welfare
Government of Telangana, India
Sunday, 21 December 2014
తుకారంగేట్ లోని అంబేడ్కర్ నగర్ పోలీసుల తనిఖీలు
హౌదరాబాద్;నేరాల నియంత్రణలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు శనివారం అర్థరాత్రి తనిఖీలు ముమ్మరం చేశారు.సికింద్రాబాద్ తుకారంగేట్ లోనిపలు ప్రాంతాలను దిగ్భందించి ఇళ్లలో సోదాలు చేశారు.ఉత్తర మండల డీసీపీ సుధీర్ బాబు నేతృత్వంలో 12 బృందాలుగా విడిపోయిన సుమారు 300 పోలీసులు ఆప్రాంతాన్ని అణువణువూ జల్లెడపట్టారు.ఈ తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను
పది రోజులే గడువు
హైదరాబాద్,2005 సంవత్సరం కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు (ఎక్సేంజ్) ఇక పది రోజుల సమయం మాత్రమే ఉంది.రూ.500,రూ.1000 కరెన్సీ నోట్లు సహాఇతర నోట్లను మార్చుకునేందుకు జనవరి1,2015ను తుది గడువుగా భారత రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) విధించింది.రిజర్వు బ్యాంకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 2005 కంటే ముందున్న నోట్లలో రూ.52,855 కోట్ల విలువైన 144.66 కోట్లకరెన్సీ నోట్లను ఇప్పటికే మార్పిడి చేసింది.నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, 2005 తరువాత తయారైన కరెన్సీ నోట్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కేంద్రీయ బ్యాంకు తెలిపింది.
మాత్ర వేసుకునేందుకు మంచినీరు లేదు?
మంచినీరు లేదు....జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రి,ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు ఇచ్చిన మాత్రలు వేసుకునేందుకు కనీసం మంచినీరు లేనిదయనీయ పరిస్థితి.జిల్లా ఆస్పత్రిలో నీటి కోసం రూపాయి వెచ్చించాల్సిందే.ఆ డబ్బు లేకపోతే ఇతర అవసరాలకు ఉపయోగించే నీరు పేదలకు దిక్కు ఇక
కేసీఆర్ తో దత్తాత్రేయ భేటీ
హైదరాబాద్;ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నేడు భేటీ అయ్యారు.వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఇరువురు నేతలు కొద్ది సేపు ఏకాంతంగా సమావేశమయ్యారు.తెలంగాణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు,కేంద్రంలోని వివిధ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న పలువిషయాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్;ఆంధ్రప్రదేశ్ ఆ సెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీ పై సభలో ప్రకటన చేయనున్నారు.సీఆర్ డీఏ,వ్యాట్,విద్య చట్టసవరణ బిల్లుల పై చర్చ జరగనుంది.మండలిలో సీఆర్ డీఏ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది కరువు,హుద్ హుద్ సాయంపై మండలిలో ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.శాసనసభ సమావేశాలు సాయంత్రం కూడా సాగనున్నాయి.
Saturday, 20 December 2014
మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలి: అరుణా రేచర్
ఉచిత వైద్య క్యాంపును ప్రారంభిస్తున్న గైనకాలజి అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షురాలు అరుణా రేచర్ తదితరులు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని గైనకాలజి అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షురాలు అరుణా రేచర్ అన్నారు. రోటరీ క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య క్యాంపును ఆదివారం సికింద్రబాద్ లోని వెస్ట్ మారెడ్ పల్లిలో ఉచితంగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ కు ఈ విధమైన వైద్య చికిత్సలు చేసుకోవాలని అనే అంశంపై చర్చించారు. దానిని అధిగమించడానికి కావల్సిన సూచనలు ఆమె వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు వైద్య పరీక్షలు చేసుకొని వాటిని నియంత్రించడానికి తోడ్పాటును అందించాలన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ గర్భినీ స్త్రీలకు వ్యాధి నిరోధక టికాలు ఇస్తున్నామని తెలిపారు. సీత మాట్లాడుతూ ఈ సమావేశాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, చంద్రకళ గోయల్ హెల్త్ కేర్ ట్రస్టు, ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్, సిడిటిపి గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇఎల్ బిఐ మెడికల్ డయగ్నస్టిక్స్ సహాకారంతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ద కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జెఎం రెడ్డి, సుధీర్, సుబ్బరాజ్, హైమా, సీతా, రాజ్, రామ్ గోపాల్, నర్సింహా, మోహన్, జయశ్రీ, సీతారామ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫోటోలు...
1.44 లక్షల వృద్ధులకు పింఛన్లు
న్యూస్ టుడే;జిల్లాలో రెండు నెలల కిందటిదాకా 2.12 లక్షల వృద్ధులకు రూ.200 చొప్పున పింఛన్లను అందజేస్తుండగా ...ప్రస్తుతం 1,44,214 మందికి రూ.వెయ్యి చొప్పున పింఛన్లు పంపిణీ చేయడానికి అనుమతులు ఇచ్చారు.66 వేల వృద్ధులకు మొదటివడతలో పింఛన్లు రాలేదు.ప్రస్తుతం మంజూరైనవారిలో 1.30 లక్షల మందికి వృదధాప్య పింఛన్లు ఇచ్చారు.ఇంకా 14 వేల వృద్ధులకు ఇవ్వాల్సి ఉంది.
కార్యదర్శుల పై దాడులను సహించం
న్యూస్టుడే;జిల్లాలో పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు దాడులు జరుగుతున్నాయని,దీన్ని సహించేది లేదని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శనావారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి దత్తాత్రేయతో తెలంగాణ తుమ్మల భేటీ
హైదరాబాద్;కేంద్ర మంత్రి దత్తాత్రేయతో తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ....తెలంగాణలోజాతీయ రహదారుల భివృద్ధికి కృషి చేస్తానని దత్తాత్రేయ చెప్పినట్లు వివరించారు.
ఉరుకుందలో తండ్రీ కొడుకు దారుణ హత్య
హైదరాబాద్;కర్నూలు జిల్లా కౌతాళ మండలం ఉరుకుందలో దారుణం జరిగింది.తండ్రీ కొడును పొలంలోనే ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు.
కేంద్రంతో ఎలాంటి విభేదాలు లేవు
హైదరాబాద్;సిద్థాంత పరంగా తమకు కేంద్రంతో ఎలాంటి విభుదాలు లేవని ....తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినప్పుడే తాము ఘర్షణ పడాల్సి వచ్చిందని తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.ప్రణాళికా సంఘం విషయంలో ప్రధాన మంత్రి మోదీ....సీఎం కేసీఆర్ సూచనలు,సలహీలకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీల ఉపన్యాసాలు,వైఖరితో కేంద్ర ప్రభుత్వం లోనూ మార్పు వచ్చిందన్నారు.విభజన చట్టంలో మార్పులకు తాము సానుకూలమేనన్నారు.
ఏపీ శాసనసభలో సీఆర్ డీఏ బిల్లును ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్;ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని ప్రాంత సాధికార సంస్థ (సీఆర్ డీఏ) ముసాయిదా బిల్లును ప్రభుత్వ ప్రవేశ పెట్టింది.పురపాలకశాఖ మంత్రి నారాయణ బిల్లును ప్రవేశ పెట్టగా సభాపతి అనుమతించారు.ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్ డీ ఏ నార్ణాయక మండలి ఏర్పాటు కానుంది.
Friday, 19 December 2014
కాకతీయ పై తెలంగాణ మంత్రల సమీక్ష
హైదరాబాద్;మిషన్ కాకతీయ పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్,నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.రంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ....సమైక్య రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఎన్ఈలు లేరన్నారు.పట్టణ ప్రాంతాల్లో నీటిపారుదల అలుగులు కబ్జాకు గురయ్యారని పేర్కొన్నారు.చెరువు నిండా నీరుంటే అనేక గ్రామాల ప్రజలు బతుకుతారన్నారు.
డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ తో రాష్ట్ర విద్యా కమిషనర్ సమీక్ష
తెలంగాణ వెబ్ న్యూస్;జిల్లాలోని ప్రభత్వ ఎయిడెడ్ డిగ్రీ కలాశాల ప్రిన్సిపల్స్ తో గురువారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ శ్తెలజరామయ్య ర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె కళాశాలలో పాలనాపరమైన అంశాలు,ప్రవేశాలు,ఉత్తీర్ణత ఫలితాలు,సిలబన్ తదితర అంశాలు సమీక్షించడంతో పాటు యూజీసీ,జేకేసీ,మనటీవీ,వాల్యూ ఎడ్యుకేషన్,ఒప్పంద అధ్యాపకులు వేతనాలు,ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలు సేకరించారు.
Thursday, 18 December 2014
పింఛన్లు ఇప్పించడం నా బాధ్యత; తెలంగాణ శాసన సభాపతి
తెలంగాణ వెబ్,న్యూస్;వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పించడం తన బాధ్యత అని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ ముధుసూదనాచారి అన్నారు.
ప్రతి న్యాయవాదికి పామాజిక బాధ్యత ఉండాలి; చంద్రబాబు
హైదరాబాద్;ప్రతి న్యాయవాదికి పామాజిక బాధ్యత ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్టాడుతూ....దేశంలో నాణ్యమైన న్యాయ వొద్యకు డిమాండ్ ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం
హైదరాబాద్;తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది.నామినేటెడ్ పోస్టుల భర్తీ,రాచకొండ అభివృద్ధి,పార్లమెంటరీ కార్యదర్శులు,కార్పొరేషన్ల విభజనపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
కరిగిపోతున్న ఆరోగ్యం
పొగత్రాగే వాళ్లలో కొందరికి కేన్సర్ రావచ్చు.చన్నప్పటి నుంచి పొగత్రాగే వాళ్ళలో పాదాలకు రక్తప్రసరణ తగ్గి బర్జర్స్ డీసీజ్ రావచ్చు.ఈ వ్యాధిలో క్రమంగా వేళ్ళు,సాదాలలోని సన్నని రక్త నాళాలు దెబ్బతిని,రక్తప్రసరణ లేక గాంగ్రీన్ వస్తుంది.క్రమంగా కాళ్ళని తీసి వేయాల్సిన పరిస్థితి రావచ్చు.
గర్భిణీ స్ర్తీలు పొగత్రాగనే కూడదు.ప్రక్కనుండే వాళ్లు పొగత్రాగుతుండినా ఆ ప్రభావం వీళ్ళమీద పడుతుంది.దీనివల్ల పుట్టిన పిల్లలో బరువు తక్కవ ఉంటుంది.నెలలు నిండకుండానే డెలివరీ రావచ్చు.కారణం లేకుండా పిల్లలు చనిపోవచ్చు.
కమ్మకకుంటున్న కాలుష్యం
జనాభా రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది.పరిశ్రమలు,వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది.పెరుగుతు్న కాలుష్య ప్రభావం మనమీద ఎంతగానో ఉంటోంది.రకరకాల రోగాలు ప్రబలుతున్నాయి.మనలో పెరుగుతున్న దురలవాట్ల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది.
ధూమపానం చేసే వాళ్ళ ముు్కు గొంతులలో దురద, ఇన్ ఫెక్షన్స్,ఆస్త్మాలాంటి వ్యాధులు రావచ్చు.
Congratulation to all of us.Our national anthem "Jana Gana Mana... "is declared as the "BEST ANTHEM OF THE WORLD"by UNESCO. Just few minutes ago. Kindly share this. Very proud to be an INDIAN. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏👏👏👏😊😊😊😊😊😊😊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🌹🌹🌹 💦 Meaning of our National Anthem 💦💦 💎💎💎💎💎💎💎💎 🇮🇳 Please try to understand the meaning and pronounce it clearly. Word by word meaning.. 💦Jana = People 💦Gana = Group 💦Mana = Mind 💦Adhinayaka= Leader 💦Jaya He = Victory 💦Bharata = India 💦Bhagya = Destiny 💦Vidhata = Disposer 💦Punjaba = Punjab 💦Sindhu = Indus 💦Gujarata = Gujarat 💦Maratha = Marati 💦Maharashtra 💦Dravida = South 💦Utkala = Orissa 💦Banga = Bengal 💦Vindhya =Vindhyas 💦Himachal =Himalay 💦Yamuna = Yamuna 💦Ganga = Ganges 💦Uchchhala = Moving 💦Jaladhi = Ocean 💦Taranga = Waves 💦Tava = Your 💦Shubh =Auspicious 💦Naame = name 💦Jage = Awaken 💦Tava = Your 💦Shubha = 💦Auspicious 💦Aashisha = Blessings 💦Maage = Ask 💦Gaahe = Sing 💦T
.
క్రైస్తవులకు సీఎం వరాలు..
హైదరాబాద్ లో 10 కోట్లతో క్రిష్టియన్ భవన్ నిర్మిస్తాం...
క్రిస్మర్ పండగకి సెలవులు రెండు రోజులు...
క్రైస్తవుల కోసం క్రైస్తవ బోర్డు ఏర్పాటు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల ఝల్లు కరిపించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల కోసం 10 కోట్లతో క్రిష్టియన్ భవన్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. రేపే జీవోను జారీ చేస్తామన్నారు. గురువారం లలితా కళా భవనంలో 36వ యూనైటెడ్ క్రిష్టమస్ సెలబ్రెషన్స్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అర్చ్ బిచప్ తుమ్మబాల, యూనైటెడ్ చైర్మన్ కె.రహ్మంత్ పీటర్, నగరంలోని వివిధ జడ్పీలు, తమ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
క్రిస్మర్ పండగకి సెలవులు రెండు రోజులు...
క్రైస్తవుల కోసం క్రైస్తవ బోర్డు ఏర్పాటు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల ఝల్లు కరిపించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల కోసం 10 కోట్లతో క్రిష్టియన్ భవన్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. రేపే జీవోను జారీ చేస్తామన్నారు. గురువారం లలితా కళా భవనంలో 36వ యూనైటెడ్ క్రిష్టమస్ సెలబ్రెషన్స్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అర్చ్ బిచప్ తుమ్మబాల, యూనైటెడ్ చైర్మన్ కె.రహ్మంత్ పీటర్, నగరంలోని వివిధ జడ్పీలు, తమ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
Wednesday, 17 December 2014
రాజధానిలో స్త్వెన్ ఘంటికలు
హైదరాబాద్;రాజధానిలో మళ్లీ స్త్వెన్ ప్లూ జడలు విప్పుతోంది.ఒకే రోజు మొత్తం ముగ్గురు ఈ వ్యాధితో మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉప్పల్ కు చెందిన శ్రీనివాస్(35),జీడిమెట్ల సమీప సూరారం కాలనీ వాసి కవిత (25) కన్ను మూశారు.వ్యాధి ముదిరినందునే వీరు మృత్యువాత పడ్డారని గాందీ ఆసుపత్రికి చెందిన నోడల్ అధికారి డా.నరసింహులు తెలిపారు.
పట్టుదలతో పనిచేస్తే మూడేళ్లలో అద్భుతాలు
హైదరాబాద్;హైదరాబాద్ పరిధిలోని కాస్త భూమి అమ్మితేనే ఏకంగా పాతిక వేల కోట్లు సమకూరుతాయ్..నిధులకేం ఇబ్బందిలేదు..ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపునకు తక్షణం రూ.50 కోట్లు ఇస్తున్నాం.మెదక్ ను మూడు జిల్లాలుగా చేద్దాం..అంతా పట్టుదలతో పనిచేస్తే అద్భుతాలు సాధ్యమే.వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్లు మొక్కలు నాటాలి.అంతా ఎక్కడికక్కడ ఉద్యమంలా పనిచూస్తే రాష్ట్రం హరితవనం అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఆరోగ్యమే,మహాభాగ్యం;
ఆరోగ్యమే మహాభాగ్యం,అని పెద్దలన్నమాట అక్షరసత్యం, ఆరోగ్యరక్షణ కై పరిసరాలు శుభ్రంగా ఉండాలి .కాని పెరుగుతున్న వాయుకాలుష్యం ప్రజలలో అనేక అనారోగ్యాలను కలిగిస్తోంది.ఎలర్జీ,ఆస్తమా,బ్రాంకైటిస్,క్షయ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారి సంఖ్య ఏటేటా పెరుడుతోంది.
కమ్యూనిటీ న్యుమోనియా
దగ్గినపుడు,తుమ్మినపుడు శ్వాసనాళాలో నుండి వెలువడే గాలి తుంపర్ల వలన ఒకరినుంచి మరొకరికి జబ్బులు వస్తాయి.క్షయవ్యాధి ఉన్నవారు దగ్గినపుడు వారిలో ఉండే టి.బి. బాక్టీరియా గాలి తుంపర్ల ద్వారా ఇతరుల ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి.ఇవి వ్యాధినిరోధక శక్తి వలన నిస్తేజయవుతాయి.కాబట్టి కొద్దిమందిలో మాత్రమే వ్యాధి
ఊపిరితాత్తుల వ్యాధులు ఎలా వస్తాయి
వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చేపిస్తాయి.ఇవి చర్మం,కళ్లపైనే కాకుండా,ఊపిరితిత్తులపైన కూడా ఉంటాయి.శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే సదార్థాలు ఊపిరితిత్తులను చేరుతాయి.వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవపదార్థాలలో చేరి కఫం ద్వారా నెట్టివేయబడతాయి.
An alert came as following: Tonight 12:30 - 3:30 sure to turn off the phone : Singapore TV has announced the news. Please read about and take care of yourself . Tell your other dear relatives and friends : This evening from 12:30 - 3:30 am , dangerous, high radiation, cosmic rays will pass close to the Earth . So please turn off your cell phone , do not let your cell phone close to your body , it may cause damage . Please check the Google NASA and BBC News , for more info.
.
మైక్రోసాఫ్ట్ 4జీ స్మార్ట్ఫోన్రూ.8,299
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: నోకియా లుమియా 638 పేరుతో చౌక ధర విండోస్ 4జీ ఫోన్ను మైక్రోసాఫ్ట్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. 4జీ నెట్వర్క్ను సపోర్ట్ చేయగలిగే ఈ ఫోన్ ధర రూ.8,299. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం ఈ ఫోన్ పనిచేస్తుంది. అమెజాన్.ఇన్ లో కొత్తగా అందిస్తోన్న మైక్రోసాఫ్ట్ బ్రాండ్ స్టోర్లో ఈ పోన్ను ఎక్స్క్లూజివ్గా ఆవిష్కరించారు. ఈ డివైస్కు సంబంధించిన ప్రీఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
లుమియా 638 ప్రత్యేకతలు: 4.5 అంగదుళాల క్లియర్బ్యాక్ ఎల్సీడీ డిస్ప్లే (రిసల్యూషన్ 480x854పిక్సల్స్, 218 పీపీఐ), 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 400 క్వాడ్కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ టీడీ-ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్), 1830 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ కొనుగోలు పై బెంగుళూరులోని పోస్ట్పెయిడ్ ఖాతాదారుల కోసం ఎయిర్టెల్ 2నెలల వ్యాలిడిటీతో కూడిన 5జీబి 4జీ డేటాను ఉచితంగా ఆఫర్ చేయనుంది. 2015 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
లుమియా 638 ప్రత్యేకతలు: 4.5 అంగదుళాల క్లియర్బ్యాక్ ఎల్సీడీ డిస్ప్లే (రిసల్యూషన్ 480x854పిక్సల్స్, 218 పీపీఐ), 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 400 క్వాడ్కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ టీడీ-ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్), 1830 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ కొనుగోలు పై బెంగుళూరులోని పోస్ట్పెయిడ్ ఖాతాదారుల కోసం ఎయిర్టెల్ 2నెలల వ్యాలిడిటీతో కూడిన 5జీబి 4జీ డేటాను ఉచితంగా ఆఫర్ చేయనుంది. 2015 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
పాక్లో చిన్నారుల మృతికి మౌనం పాటించిన భారత విద్యార్థులు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 17 : పాకిస్తాన్లో సైనిక స్కూల్పై విద్యార్థుల దాడికి నిరసనగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విద్యార్థులు సంతాపం ప్రకటించారు. వివిధ పాఠశాలల్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.
మల్కాజ్గిరి సెంట్రల్ బ్యాంకు దోపిడీ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. ఈ దోపిడీలో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తాళం చెవులతోనే లాకర్లను ఓపెన్ చేసినట్లు గుర్తించారు. గతంలో బ్యాంకులో పనిచేసిన సిబ్బంది.. లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ల హస్తం ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. బంగారు నగలు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంకులో తెల్లవారుజామున చోరీ జరిగింది. తాళాలతో బ్యాంకు షట్టర్ తెరచిన గుర్తుతెలియని వ్యక్తి.. కిలో బంగారం, లక్షా 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా చూస్తే.. తాళాలు తీసుకుని దర్జాగా లోపలికి వెళ్లినట్లు తేలింది. సీసీ కెమెరా ఫుటేజ్లో చోరీ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుస్తోంది. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకు దోపిడీ గురించి తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు దగ్గరకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
.
Tuesday, 16 December 2014
ప్రాణవాయువే మనకు శక్తిదాత
మన శరీరంలో అనేక భాగాలున్నాయి.ఏభాగం ప్రాదాన్యత ఆ భాగానిదే ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా అనారోగ్యం కలుగుతుంది.అందుకే అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం.మనిషి జీవించడానికి ఆహారం,నీరుతోపాటు స్వచ్ఛమైన గాలి అంటే ఎన్నో వాయువుల మిశ్రమం.వీటిలో నైట్రోజన్,ఆక్సిజన్,కిర్భన్-డై'ఆక్స్తెడ్ లు ప్రధానమైనవి.
మహిళలకు అవకాశం ఇస్తే బాగుండేది; డీకే అరుణ
హైదరాబాద్;ఆలస్యంగానైనా మహబూబ్నగర్ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషకరమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.ఆమంత్రులు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పై దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు.మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మంగళవారం ఆమె సీఎల్పీలో విలేకరులతో మాట్టాడారు.
తెలంగాణ వ్యతిరేకులకు మంత్రి పదవులు
హైదరాబాద్;తెదేపాలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ,తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.మంగళవారం సచివాలయంలోమీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
Monday, 15 December 2014
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం
హైదరాబాద్;ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త మంత్రులను సీఎం పరిచయం చేశారు.ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నిరంజన్ రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.
ఎమ్మేల్యే పదవికి తలసాని రాజీనామా
తెలంగాణ వెబ్ న్యూస్;ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేశారు.సనత్నగర్ నుంచి ఆయన ఎమ్మేల్యేగా గెలుపొందారు.ఎమ్మేల్యే పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి కూడా తలసాని రాజీనామా చేశారు.తలసాని తన రాజీనామా లేఖను తెలంగాణ సభాపతికి పంపారు.విషయం తెలుసుకున్న తలసాని అభామానులు ఆయన నావాసానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికల్లో పోటీ చేసీ గెలవటం కొత్త కాదని,సనత్ నగర్ ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
తెలంగాణ వెబ్,న్యూస్ హైదరాబాద్;తెలంగాణలో ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ లో ఘనంగా జరిగింది.తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్...తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,లక్ష్మారెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డిలతో మంత్రలుగా ప్రమాణం చేయించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఉప ము్క్యమంత్రులు రాజయ్య,మహమూద్అలీ, శాసనసభాపతి మధుసూదనాచారి,మండలి ఛైర్మన్ స్వామిగౌడ్,సలువురు మంత్రులు,ఎమ్మేల్సీలు ఈ కార్యక్రమానికి హాజరై కొత్త మంత్రులకు అభినందలు తెలిపారు.
ఆరుమంది మంత్రులు వాళ్ల పేర్లు
తెలంగాణ వెబ్,న్యూస్;ఆరుమంది మంత్రులు వాళ్ల పేర్లు
తుమ్మల నాగేశ్వరరావు
తలసాని శ్రీనివాస్ యాదవ్
అల్లొల ఇంద్ర కరణ్ రెడ్డి
అజ్మీరా చందులాల్
సి.లక్ష్మా రెడ్డి
జూపల్లి కృష్ణారావు
The Minister for IT, Government of Telangana Sri KT Rama Rao met migrant workers from Telangana who are working in Dubai. Migrant workers from Telangana constitute the second largest group of migrant workers after those from Kerala. It is estimated that there are about a lakh workers from Telangana in Dubai. The Minister visited Sonapur camp where about 20,000 workers from Telangana live. The Minister inspected their living facilities, kitchen, dining hall, and bathrooms. He then conducted detailed interaction with them about their problems. Many workers face a number of problems that start from when they are in India itself, and continue after their arrival in Dubai and during their employment. They get exploited by agents first and then by some of the employers. They face very difficult living conditions. Non-payment of minimum wages is another common issue. The Minister discussed the possibility of organising skills training for workers planning to work overseas, registration of w
.
దుబాయి వలస కార్మికు క్యాంపు(నివాసిత ప్రాంతాల్లో) మంత్రి కెటియార్ పర్యటన) 20 వేల తెలంగాణ కార్మికులుండే సోనాపూర్ క్యాంప్ పరీశీలన.. కార్మికుల సమస్యలపై అరా...జీవన స్దితిగతుల పరిశీలన...కార్మికులు రూంలు, వంటగదులు, వారి నివాసాల్లోనే బేటీ దుబాయి సెంట్రల్ జైలుకెళ్లి అక్కడి శిక్ష అనుభవిస్తున్న కార్మికుల పరామర్శా...తెలంగాణకి తెచ్చేందుకు న్యాయ సహయానికి హమీ... ఏంజెట్ల మెసాన్ని మంత్రి దృష్టికి తెచ్చిన కార్మికులు...ఏజెంట్ల క్రమబద్దీకరణ, కార్మికులకి భీమా పధకం రూపకల్పణ ...గల్ప్ వెళ్లె యువతికి వృత్తి నైపున్య శిక్షణ కల్పన, తెలంగాణకి తిరిగి వచ్చే వారికి ఇక్కే ఉపాది అవకాశాల కల్పన , గల్ప్ లో పట్టుబడిన వారికి న్యాయ సహయం, లాంటి అంశాలపై చర్చ ఇండియన్ ఏంబసీలో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకంపై కేంద్రంతో చర్చిస్తామన్నా మంత్రి గల్ప్ కార్మికుల వివరాల నమెదుతో పాటు వసల కార్మికులకి సంబందించి పాలసీ రూపకల్పన చేస్తాం
.
INVITATION: Joint Press conference on Safety and Security Measures for Tourists and Public visiting Hussainsagar AND other Tourist spots around lake on today 15th December,2014 at 4pm venue Park opposite to Necklace Road MMTS Rly.Station Rd participants DCP Central Zone, Member Environment, HMDA, OSD Budha Purnima project and Zonal Commissioner of GHMC,GM TS Tourism ,DCP Traffic, Addl.DCP CSW and one person who was rescued from committing suicide last night will be produced before media for public awareness From : PRO
.
రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, కేబినెట్లో మరో 6గురికి చోటు
హైదరాబాద్, తెలంగాణ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం జరగనుంది. ఈ కేబినెట్లో మరో ఆరుగురికి చోటు దక్కనుంది. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చందూలాల్, ఇంద్రకరణ్రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు తుమ్మల, తలసాని బహిరంగంగా కటౌట్లు పెట్టుకోవడంతో వారి పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మంత్రుల పేర్లు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఇప్పటికే కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
సంగీత దర్శకుడు చక్రికి కన్నీటి వీడ్కోలు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; సీంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన సినీ అభిమానులు, ప్రజలు చక్రికి కడసారి కన్నీటి వీడ్కొలు పలికారు.
Sunday, 14 December 2014
Mr. K.T. Rama Rao, Hon'ble Minister for Information Technology, Government of Telangana, Mr. K. Pradeep Chandra, Special Chief Secretary for Industries, Mr. Jayesh Ranjan, MD, TSIIC and Commissioner of Industries along with delegation from FICCI visited SMART CITY, Dubai today (14th December 2014) and interacted with Mr. Abdul-latif Al-mulla, Chief Executive Officer, Smart City and Dr. Baju George, Managing Director. During the interaction, the possibility of developing a Smart City in Hyderabad as a part of "Information Technology Investment Region (ITIR)" was discussed. Mr. Mulla expressed his happiness at this offer and has decided to visit Hyderabad within the next one week for follow up discussions. Smart City in Dubai is as integrated development featuring offices for IT Companies along with residential and commercial development, all having a number of features that enable the people who work and live there to have a high quality of life using various technology solutions. Sma
Saturday, 13 December 2014
Jeedimetla industri phase 1 lo scrap dukanam yajamani pai gurtuteliyani 4guru dundagulu vetakodavallato dadi treevragayalu prastutam pravetu asupatrlo chikista ps jdm 11am ku jarigindi. Jeedimetla seesala bhastilo o parisramalo panichestunna mahila pramadavashattu mishanlo padi mahila mruti parisrama mundu bandula andolana ps jdm
.
Friday, 12 December 2014
కల్తీ కల్లు తాగి ఒకరు మృతి
హైదరాబాద్;నిజామాద్ జిల్లా బీర్కూర్ మండలం సంగెంలో కల్తీకల్లు తాగి ఒకరు మరణించారు.కల్తీ కల్లు తాగిన మరో 15 మంది అస్వస్థు లైనట్లు సమాచారం.
యూసుఫ్ గూడలో పేలుడు
తెలంగాణ వెబ్,న్యూస్;యూసుఫ్ గూడలోని జవహర్నగర్ లో ఓఇంటి ఆవరణలో పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో కీర్తి వాణి (7), నరసమ్మ(13),యోగి (5) అనే చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతూ కీర్తివాణి మృతి చెందింది.నరసమ్మ,యోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం రేకుల షెడ్డులాంటి ఒక ఇంట్లో రెండు,మూడు కుటుంబాలు అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది.
మనం ఎలా శ్వాసిస్తాం
మనం మాములుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం.వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలి గాలి సరాసరి శ్వాసనాళాలలొకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకుని శ్వాసనాళాల్లోకి వెలుతుంది.ముక్కు నుంచి గాలి నేసోఫారింక్స్,లారింక్స్ ఆతరువాత ట్రేకియాలోకి వెళుతుంది.ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగాచీలి ఉంటుంది.వీటిని బ్రాంకై అంటారు.ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులలోనికి వెళతాయి.క్రమంగా ఈ నాళం రెండు రెండుగా చీలుతూ ఊపితిత్తులను ఆక్రమిస్తాయి.
పాము కందిరీగ ల కథ
ఒక పాము పడగ మీద ఒక కందిరీగ చక్కగా కూర్చుంది.చాలా సార్లు దాన్ని కుట్టడమే కాకుండా గట్టిగా పట్టి వదలడం లేదు.
ఈ బాధని పాము భరించలేకపోయింది. ఎలాగైనా కందిరీగని వదుల్చుకోవాలని చూసింది.చెట్టుకీ పుట్టకీ పడగ రాసిరాసి చూసింది.కాని ఫలితం దక్కలేదు. ఇక ఏం చేయాలో తెలియక -దానికి పిచ్చిగా కోపం వస్తోంది. బుసలు కొట్టినా కందిరీగ పట్టించుకోలేదు ''నిన్ను చంపి తీరతాను. ఆచంపే ప్రయత్నంలో నేను చచ్చినా బాధపడను '' అని పాము శపథం చేసింది. అంతేకాదు.రహదారిపై దారికాచి భారంగా కిర్రుకిర్రుమంటూ వస్తూన్న సరుకుల బండి చక్రం కింద తన తలపెట్టింది.పాముతో పాటు కందిరీగ కూడా చచ్చింది.
నిజమే కదా, నిస్సహాయమైన స్థితిలో ఏం చేయాలో తోచనప్పుడు ఇలా ప్రాణం తీసుకునేందుకైనా వునుకాడరు బలవంతులైనా -బలహీనులైనా......కదూ.
Thursday, 11 December 2014
కేసీఆర్ పాలనా సమర్థుడు
|
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలనా సమర్థుడని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవాలని, రాష్ట్ర అభివృద్ధికి సీపీఐ సహకరిస్తుందనిచెప్పారు. నల్లగొండ జిల్లా రాజాపేటలోబుధవారం ఆరుట్ల కమలాదేవి- రాంచంద్రారెడ్డి ఫౌండేషన్, రామానందతీర్థ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన ఆరుట్ల దంపతుల చరిత్ర మరువరానిదని అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించడానికి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలోఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఆరుట్ల ఫౌండే షన్ వ్యవస్థాపకులు సుశీలాదేవి, ప్రొఫెసర్ కిశోర్రెడ్డి పాల్గొన్నారు.
|
గుట్టపై 180 అడుగుల అంజన్న..
విగ్రహం ఏర్పాటుకు కసరత్తు
మూడు దశాబ్దాలకు మోక్షం
రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా
(యాదగిరిగుట్ట)
మూడు దశాబ్దాలకు మోక్షం
రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా
(యాదగిరిగుట్ట)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి విగ్రహం ఏర్పాటు చేయాలన్న తలంపు ఈనాటిది కాదు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే దీనికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ తర్వాత శిలాఫలకమే తొలగించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటనతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన మేరకు ఆ దిశగా దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్ధులకు అస్వస్థత
హైదరాబాద్;అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లిపడిన ఆహారం తిని 8 మంది అస్వస్థతకు గురయ్యారు.మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోలన చేపట్టారు.
తెలంగాణ సర్కారుకు డబ్బే డబ్పు
తెలంగాణ వెబ్,న్యూస్;హైదరాబాద్ నగరం శివార్లలో నాలుగు తుకడాలు అమ్మినా కూడా రూ.20 వేల కోట్లు వస్తాయి.ఈ మాటలు అన్నది సాధారణ వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్రావు...కొద్ది రోజుల కిందట నగరంలో జరిగిన ఓ సభలో ాయన మాటలన్నారు.ఇప్పుడు నగరంలో పట్టణ భూగరిష్ట పరిమిత చట్టం ( యూఎల్ సీ) కింద ఉన్న భూములను విక్రయిస్తే ఇంత మొత్తం వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఈ చట్టం కింద ఉన్న భూములను సర్వే నివేదికను బుధవారం తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
తెలంగాణ వెబ్,న్యూస్; ఆర్టీసీ బస్సు మార్షల్ జీపు ఎదురెదురుగా డీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు.
పింఛను రాలేదని గుండెపోటుతో వ్యక్తి మృతి
హైదరాబాద్;పింఛను రాలేదని మనస్తాపంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మాణిక్యారంలొ జరిగింది.మాణిక్యారం గ్రామానికి చెందిన భూక్యా బాలు పింఛను రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో ఈ రోజు ఉదయం మృతి చెందాడు.
పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్యాత్నం
హైదరాబాద్;పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీసులు కొట్టారని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఏలూరులోని అమీనా పేటలోని నివాసం ఉంటుంన్న నాగవేంకట మల్లేశ్వరరావు అనే యువకుడు ఎం.ఎ, బీఈడీ పూర్తి చేశాడు.అదే ప్రాతంలో ఓ యువతిని ప్రేమిస్తున్నాడని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాధు చేవారు.దీంతో పోలీసులు యువకుడ్ని స్టేషన్ కు తీసుకువచ్చి చితకాబాదారని.మనస్థాపానికి గురైన మల్లేశ్వరరావు ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత,బంజారా భవన్లకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
తెలంగాణ వెబ్,న్యూస్ హైదరాబాద్;బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని దళిత,బంజారా భవన్ ల నిర్మాణానికి శంకుప్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్టాడుతూ...ఆదిలాబాద్ జిల్లాలోని గోండుగూడెం నుంచి జల్ జమీన్ జంగిల్ నినాదం ప్రారంభమై....దశాబ్దాలుగా పోరాటం జరిగిందన్నారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమ న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ద్యేయమన్నారు.
ప్రతి రైతు ఆత్మ గౌవరంతో బతకాలి; చంద్రబాబు
హైదరాబాద్;ప్రతి రైతు ఆత్మగౌవరంతో బతకాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.చిత్తూరులో ఏర్పాటు చేసిన రైతుసాధికార సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్టీఆర్ మయాంలోనే మొట్ట మొదటి సారిగా రైతులకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రేస్ పాలనలో రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు.ఇచ్చిన మాట తప్పే మనస్తత్వం తనది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.చాలా మంది రుణమాఫీ సాధ్యం కాదన్నారు.
Wednesday, 10 December 2014
విగ్రహం ఏర్పాటుకు కసరత్తు
మూడు దశాబ్దాలకు మోక్షం
రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా
(యాదగిరిగుట్ట)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి విగ్రహం ఏర్పాటు చేయాలన్న తలంపు ఈనాటిది కాదు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే దీనికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ తర్వాత శిలాఫలకమే తొలగించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటనతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన మేరకు ఆ దిశగా దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
మూడు దశాబ్దాలకు మోక్షం
రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా
(యాదగిరిగుట్ట)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి విగ్రహం ఏర్పాటు చేయాలన్న తలంపు ఈనాటిది కాదు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే దీనికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ తర్వాత శిలాఫలకమే తొలగించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటనతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన మేరకు ఆ దిశగా దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలు జారిపడ్డారు. ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. హుiటాహుటిన ఆయనను నిమ్స్కు తరలించారు. సుగర్ వ్యాధి ఉన్న ఆయనకు గతంలోనే కాలిపై ఒక గాయం అయింది. ఈ రోజు కాలు జారిపడటంతో ఆ గాయంపైనే మళ్లీ గాయం అయింది. దాంతో రక్తం కారింది. ఆయన ఛాంబర్లో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు నిమ్స్లో చికిత్స చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ;ఏడుగురి మృతి
తెలంగాణ వెబ్,న్యూస్;ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా ధామ్ పూర్ వద్ద ట్రక్కు వ్యాను డీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొరాబాద్ కు చెందిన వీరు వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తూండగా ఈ ప్రమాదం చోటుచేసుకుని దామ్ సూర్ పోలిసు అధికారి హరేంద్ర యాదవ్ వెల్లడించారు. వ్యాన్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కున్న డీకొట్టినట్లు చెప్పారు. గాయపడిన వారి పనిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
Tuesday, 9 December 2014
కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థినిలు
తెలంగాణ హైదరాబాద్;నిజామాబాద్ కలెక్టరేట్ ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి.బోధనా రుసుములు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు.
పెళ్లి బృందం వ్యాను బోల్తా ;15 మందికి గాయాలు
తెలంగాణ హైదరాబాద్;కరీంనగర్ జిల్లా కోరుట్ల శివారులో పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి బృందం వ్యాను రుద్రాంగి నుంచి మందమర్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కరీంనగర్ ,కు బయలుదేరిన సీఎం కేసీ ఆర్
తెలంగాణ హైదరాబాద్;తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్,సిద్దిపేట పర్యటనకు బయలుదేరారు.లోయర్ మానేరు డ్యాం వద్ద దట్టంగా పొగమంచు అలముకోవడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతివ్వలేదు.దీంతో కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఆలస్యంగా బయలుదేరారు.
వికలాంగ పింఛన్ల విడుదల
తెలంగాణ హైదరాబాద్;ఆసరా పింఛన్ల చెలింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.213.65 కోట్లు విడుదల చేసింది.అక్టోబర్,నవంబర్ నెలల పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వికలాంగ పింఛన్ల కోసం రూ.54 కోట్లు విడుదల చేసింది.
కప్ప ట్రాళ్ల హత్య కేసులో 21 మందికి శిక్ష ఖరారు
తెలంగాణ వెబ్,న్యూస్;కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి శిక్ష ఖరారు చేస్తూ ఆదోని సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది.
పేదలంరీకి లబ్ధి చేకూర్చుతాం; కేటీఆర్
అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టి,రాష్ర్టాన్ని సాధించుకున్నాం.వారి ఆశలు,ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటాం.వారి దీవెనలతోనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారికి ఇబ్బంది కలిగించే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు అని తెలంగాణ రాష్ర్ట పంచాయతీ రాజ్,ఐటీశాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నిందితులకు ఆర్నెల్ల జైలు
సత్యం కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాల నిర్వహణలో కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడం పై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ బి.రామలింగరాజు ,వడ్లమాని శ్రీనివాసులకు 6 నెలలకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
సీఎంగా పార్లమెంటుకు కేసీఆర్
తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ సొమవారం తొలిసారి పార్లమెంటు కు వచ్చారు.అక్కడ తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హజరయ్యారు.
జమ్మూకశ్మీర్ లో 27.03,ఝార్ఖండ్ లొ 30శాతం
తెలంగాణ వెబ్,న్యూస్;జమ్మూకశ్మీర్ ,ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళవారం మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.జమ్మూకశ్మీర్ లోని 16 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 12 గంటల సమయానికి 27.03 శాతం పొలింగ్ నమోదైంది.
Monday, 8 December 2014
Sunday, 7 December 2014
.విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు..
- -వరుస ప్రమాదాల్లో బలవుతున్న ప్రముఖులు....
- ప్రాణాలు తీస్తున్న అతి వేగం...
- గమ్యస్థానానికి చేరాలన్న తొందరలో దూకుడు ప్రయాణం...
- సీటు బెల్ట్ వాడరు...
- ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- డ్రైవర్ల పట్ల పర్యవేక్షణా లోపం...
- చిన్న అశ్రద్ధకు భారీ మూల్యం...
- రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది బలి త్వరగా వెళ్లాలనే ఆరాటం...
శోభానాగిరెడ్డి వైఎస్ఆర్ సీపీ నేత, ఎర్రన్నాయుడు టీడీపీ నేత, లాల్జాన్ బాషా టీడీపీ నేత, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి (s/o కోమటిరెడ్డి వెంకట్రెడ్డి), కోటా వెంకట ప్రసాద్ (s/o కోటా
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఆ ఆత్రుతే ప్రాణాల మీదకు తెస్తోంది... ఆ తొందర్లోనే చిన్న చిన్న జాగ్రత్తలను గాలికి ఒదిలేయడం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎందరో ప్రముఖులు, మరెంతో మంది భవిష్యతారలు ఇలాగే మృత్యువాతపడ్డారు. అతి వేగం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంటుంది. కాని భయపడేవారేవరూ. కేర్లెస్గా ఉండటమే తమకు ఇష్టమని ఆధునిక యూత్ ర్యాష్ డ్రైవింగ్తో మరీ చెప్తోంది. వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటే... ఎవరికి నష్టం. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీర్చుతారు?
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఆ ఆత్రుతే ప్రాణాల మీదకు తెస్తోంది... ఆ తొందర్లోనే చిన్న చిన్న జాగ్రత్తలను గాలికి ఒదిలేయడం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎందరో ప్రముఖులు, మరెంతో మంది భవిష్యతారలు ఇలాగే మృత్యువాతపడ్డారు. అతి వేగం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంటుంది. కాని భయపడేవారేవరూ. కేర్లెస్గా ఉండటమే తమకు ఇష్టమని ఆధునిక యూత్ ర్యాష్ డ్రైవింగ్తో మరీ చెప్తోంది. వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటే... ఎవరికి నష్టం. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీర్చుతారు?
మైక్రో సాప్ట్ విండోస్ వర్షన్ ని తెలంగాణ భాషలో రీలీజ్ చేయడానికి నిర్ణయం
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;
- .మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ విండోస్ వెర్షన్ ని తెలంగాణ భాషలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కింద తెలంగాణా వెర్షన్ లో కొన్ని పదాలు ప్రతిపాదించడమైనది...
- కిటికీల్ రెండువేలు(windows2000) కోసం. keywords search = దేవులాడు Save = బచాయించు Save as = గిట్ల బచాయించు Save All = అన్ని బచాయించ్ Help = నన్ను బచాయించు Find = ఎతుకు Find Again = మల్ల ఎతుకు Move = సర్కాయించ్ Zoom = పెద్దగజెయ్ Zoom Out = చిన్నగజెయ్ Open = తెరువ్ Close = ముయ్ New = కొత్తది Old = పాతది Replace = మార్చెయ్ Insert = నడిమిట్ల వెట్టు space = జాగ Backspace = ఎన్క జాగ Run = ఉరుకు Print = అచ్చు Print Preview = చూసి అచ్చేయ్ Copy = గట్లాంటిదే Cut = కొయ్యి Paste = అతుకు Delete = తీసిపడేయ్ View = సూడు Tools = ముట్లు Toolbar = ముట్ల గొట్టం Exit = ఇగవోరి Compress = గుంజు mouse = ఎల్క click = వత్తు Double Click = మల్ల మల్ల వత్తు Forward = ఈడకెల్లి ఆడకి Scrollbar = తిప్పుడు గొట్టం ACCESS = దొరకవట్టు FOXPRO = నక్కలెక్క తురుంకాన్ Lotus Notes = తామర్ పువ్ పైసల్ ACCESS DENIED = దొరకవట్టనీయవా Home = ఇన్టి కి వో end = కోనా కి Errors
యాదగిరిగుట్ట ఘాట్ పరిధిలో ఘోర ప్రమాదం.... లోయలో పడిన టాటా ఏస్ వాహనం...
- హటాత్తుగా ముగ్గురి మృతి...
- కారును తప్పించబోయి లోయలో పడిన టాటా ఏస్...
- ముగ్గురి మృతి... 11 మందికి గాయాలు...
- 11 మందికి గాయాలు.. మృతులు బోడుప్పల్ వాసులు...
- ఒకరి పరిస్థితి విషమం.. మృతులు బోడుప్పల్ వాసులు...
- దివాన్చెరువు ప్రమాదంలో ఇద్దరి మృతి...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్రోడ్డుపై వాహనం పల్టీ కొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బోడుప్పల్, ఘట్కేసర్ మండలం తేనుగూడెం నుంచి కొందరు శనివారం రాత్రి టాటా ఏస్ వాహనం(ఏపీ 10 డబ్ల్యూ 7206)లో లక్ష్మీనరసింహుడి దర్శనానికని బయల్దేరారు. ఘాట్రోడ్లో హోటల్ పున్నమి సమీపంలో గల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి వాహనం పల్టీకొట్టి లోయలో పడిపోయింది. దీంతో నర్సమ్మ, ఆంజనేయులు, కృష్ణగా భావిస్తున్న బోడుప్పల్ వాసులు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ కాకి రాములు, పావని, విఘ్నేష్, స్వప్న మాధురి, కల్పన, తులసి, భరత్, లత, సౌమ్య, లక్ష్మి, వేణుగోపాల్ తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని లోయలో నుంచి బయటకు తీసిన పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఘట్కేసర్ మండలం తేనుగూడెం గ్రామానికి చెందిన గడ్డం వేణుగోపాల్ పరిస్థితి విషమంగా ఉంది.
విశాఖకు వెళ్లి వస్తుండగా..
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 12 మంది ఒకే వాహనంలో శుక్రవారం విశాఖపట్నంలోని పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రాజమండ్రి సమీపంలోని దివాన్చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన బచ్చు ఆంజనేయులు (39) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జీలుగుమిల్లి మండల కామయ్యపాలెం వాసి సీమకుర్తి మల్లిఖార్జునరావు (45) చికిత్స పొందుతూ రాజమండ్రి ఆస్పత్రిలో మృతి చెందాడు.
జనకీరామ్ మృతి ఎంతో బాధకరం; చిరంజీవి
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకిరామ్ మృతి చెందడం చాలా బాధకరమని కాంగ్రెస్ నేత, ప్రముఖ నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం జానకిరామ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఆయన హరికృష్ణను పరామర్శించారు. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కారు డ్రెవ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరిస్తే ఇలాంటి అవాంతరాలు జరుగకుండా కొంతమేరకు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి విన్నవించారు.
Saturday, 6 December 2014
నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు దుర్మరణం...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:
మునగాల, కోదాడ, హైదరాబాద్: టీడీపీ పొలి ట్బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్(42) శని వారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్-విజయవాడ 65 నంబర్ జాతీ య రహదారిపై నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ఘటన జరి గింది. జానకిరామ్ ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్రూట్లో వెళుతున్న ట్రాక్టర్ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొంది. ఈ సమయంలో వాహనాన్ని నడుపుతున్న జానకిరామ్కు తీవ్రంగా గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కోదాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా.. జానకిరామ్ మృతదేహాన్ని శనివారం రాత్రి 8 గంట లకు కోదాడ నుంచి హైదరాబాద్కు తరలించా రు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని హరికృష్ణ ఇంటికి తరలించారు.
హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన కేసీఆర్, చంద్రబాబు, జగన్
ఏపీ ఆన్ లైన్, హైదరాబాద్: జానకిరామ్ మృతి పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సం తాపాన్ని వ్యక్తం చేశారు. వార్త తెలిసిన చంద్రబాబు హరికృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి వై.సత్యనారాయణ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు, ఏపీ మంత్రులు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నారా లోకేశ్ తదితరులు సంతాపం ప్రకటించినవారిలో ఉన్నారు. తన సోదరుని కుమారుడి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ మృతి
- రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ఢీ కొన్న వాహనం...
- విరిగిపోయిన జానకీరామ్ కుడి చెయ్యి, కడుపులో తీవ్ర గాయాలు
- ఆసుపత్రికి తరళిస్తుండగా కన్నుమూత
- నల్లగొండ జిల్లా ఆకుపాముల 65వ నెంబర్ రహదారిపై దుర్ఘటన
- హైదరాబాద్ లో జానకీ రామ్ నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
- తరళి వచ్చిన సిని, రాజకీయ ప్రముఖులు...
- తెలంగాణ సీఎం, వైఎస్ జగన్ సంతాపం...
నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్రూట్లో వెళుతున్న ట్రాక్టర్ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొంది. ఈ సమయంలో వాహనాన్ని నడుపుతున్న జానకిరామ్కు తీవ్రంగా గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కోదాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా.. జానకిరామ్ మృతదేహాన్ని శనివారం రాత్రి 8 గంట లకు కోదాడ నుంచి హైదరాబాద్కు తరలించా రు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని హరికృష్ణ ఇంటికి తరలించారు.
హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన కేసీఆర్, చంద్రబాబు, జగన్
ఏపీ ఆన్ లైన్, హైదరాబాద్: జానకిరామ్ మృతి పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సం తాపాన్ని వ్యక్తం చేశారు. వార్త తెలిసిన చంద్రబాబు హరికృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి వై.సత్యనారాయణ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు, ఏపీ మంత్రులు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నారా లోకేశ్ తదితరులు సంతాపం ప్రకటించినవారిలో ఉన్నారు. తన సోదరుని కుమారుడి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Subscribe to:
Posts (Atom)



.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)






















.jpg)


