All meadia

 

Wednesday, 18 February 2015

సురేష్‌ ప్రాడక్షన్స్‌ అధినేత, ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూసారు



: మూవీ మొగల్‌ సురేష్‌ ప్రాడక్షన్స్‌ అధినేత, ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూసారు. అపోలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. గత కొద్దికాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు కాగా, మరొకరు హీరో విక్టరీ వెంకటేష్‌. రాముడు భీముడుతో ప్రారంభమైన ఆయన సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. భారతీయ భాషలన్నింటిలోనూ సినిమా నిర్మించిన ఘనత కూడా రామానాయుడుదే. నిర్మాతగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు.

No comments:

Post a Comment