తెలంగాణ వెబ్ న్యూస్;పింఛనుదారులను వేధింపులకు గురిచేయవద్దంటూ బ్యాంకులను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. పదవీవిరమణానంతరం పింఛను పొందుతున్న ప్రభుత్వోద్యోగులను స్వయంగా బ్యాంకుకు వచ్చి లైఫ్ సర్టిఫికేట్ లను సమర్పించాల్సిందిగా ఒత్తిడి చేయరాదని సూచించింది. పింఛను కొనసాగింపునకు ఈ సర్టిఫికేట్ ను సమర్పించడం తప్పని సరైనప్పటికీ...ఆధార్ ధృవీకరణ,సంబంధింత అధికారుల సంతకాలతో సహా అది పక్కాగా ఉన్నప్పుడు..స్వయంగా రావలసిందిగా ఒత్తిడి చేయనేరాదని ఉద్ఘాటించింది. పింఛను దారలంతా కూడా ఏడాదికోసారి తాము జీవించే ఉన్నట్లు ధృవీకరించే పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment