తెలంగాణ వెబ్ న్యూస్;వృత్తి,ఉన్నత విద్యలో నాణ్యతపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం...కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి ప్రైవేటు కలాశాలలకు అనుమతులు మంజూరు చేయకూడదంటూ కేంద్రాన్ని కోరాలని యోచిస్తోంది.వృతి విద్యా కళాశాలలకు అనుమతులిచ్చే అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి,ఫార్మా కలాశాలను చూసే..ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఈ మేరకులేఖ రాయబోతోందని సమాచారం.ప్రతి ఏడాది మాదిరిగానే రాష్ట్రంలో కళాశాలల స్థితిగతులు...భవిష్యత్ అవసరాలపై కేంద్రం ఈ సారి కూడా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది.అయితే ఏటా దీన్ని అంతగా పట్టింయుకునేవారు కాదు.కానీ..వృత్తి విద్యలో ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో నాణ్యతను పెంచాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం..ఇప్పటికే సదుపాయాలు,బోధన సిబ్బంది సరిగ్గా లేని కళాశాలలపై వేటు వేసింది.
No comments:
Post a Comment