All meadia

 

Tuesday, 30 September 2014

ప్రపంచంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం కల్పించేవిధంగా కృషి....

ప్రపంచదేశాలలో టాప్ టెన్ లో హైదరాబాద్ నిలిచేవిధంగా అభివృద్ది
ఈ సమావేశానికి 49 దేశాల నుంచి ప్రత్యేక నిపుణులు... 
హెచ్ఐసిసిలో ఈ నెల 7న ప్రారంభమై 10న ముగుస్తుంది...
వివిధ ప్రత్యేక దేశాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ది చేసే విధంగా చర్యలు.. 
 మెల్ బొర్న్ సిటి
వియన్నా....

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; దేశంలో స్మార్ట్ సిటిల రూపకల్పణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ప్రాధాన్యతను సంతరించుకుంది... హైదరాబాద్ ను ఆహ్లాదకరమైన వాతావరణం, కొత్త హంగుళతో మెట్రో రూపకల్పణకు కొత్త ఆలోచనలు త్వరలో వెలుగులోకి రానున్నాయి. ఇప్పటికే దేశాలలో పలు సిటిలు అభివృద్ది చెందిన సిటిలను పరిశీలిస్తే మెల్ బొర్న్, వియన్నా తదితర సిటీలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. 
అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి... మెట్రో పొలిస్ ముఖ్య లక్షణం ఏమిటంటే దేశంలో ఉన్న టాప్ సిటిలను పరిగణలోకి తీసుకొని, హైదరాబాద్ ను టాప్ సిటీలలో ఒకటిగా నిలిచేందుకు ఈ సదస్స ముఖ్య లక్షణం.
దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా ఈ అంశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్ఐసిసిలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని  ఈ నెల 7వ తేదిన ప్రారంభమై 10కి ముగుస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ది  చెందిన దేశాల్లో అమలులో ఉన్న ఆర్థిక, సాంకేతిక విధానాలను రూపొందించేవిధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మెట్రో పొలిస్ సమావేశానికి 49 దేశాల నుంచి ప్రత్యేక నిపుణులు పాల్గొననున్నారు. ఇందులో నగరాలకు సంబంధించిన పాలన, అభివృద్దికి పరమైన నిర్ణయాలు యువత, మహిళల అభిప్రాయాలను చెప్పేందుకు వాయిస్ ఆఫ్ చర్చలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పల్లేటూరుల నుంచి వలస వచ్చిన యువత, 30 శాతం ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మెట్రో పొలిస్ సాకారమైతే 50 శాతం వరకు జనాభా పెరిగే అవకాశం ఉంది. సిటిలలో ఇంత జనాభా ఎంటి..? పర్యావరణం, సాంకేతికతపై ప్రభావం చూపే  అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిస్తోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారానికి మెట్రో పొలిస్ సదస్సు కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు దేశాలలో నగరాలు అభివృద్ది చెంది ఉన్న దేశాలను పరిశీలిస్తే వియన్నా, మెల్ బొర్న్ తదితర సిటీలను ఇప్పటికే పరిశీలనలోకి వచ్చాయి. 
హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం.... 
గ్రేటర్ సిటీ లక్ష్యంగా మెట్రో పొలిస్ సదస్సును నిర్వహించడంపై అనేక దేశాల నుంచి కొత్త కొత్త వినూత్న ఆలోచనలను అందుబాటులోకి తీసుకొని చర్చించడం జరుగుతుంది. ప్రపంచంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం కల్పించే దిశగా కృషి చేయనున్నట్లు తెలుస్తుంది. 

కొలన్ హన్మంతరావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్న యువత...

కొలను వెంకటేశ్ టీఆర్ఎస్ లోకి ఆహ్వనం... 
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; కుద్బుల్లాపూర్ మున్సిపల్ పరిధిలో డివిజన్ 128 కాలనీలో, సిటి ప్యాలెస్ ఫంక్షన్ హాలులో 128 డివిజన్  కు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు పండగ వెంకటేష్ ముదిరాజ్ భారీ ఎత్తున్న మహిళలు. యువతులు సీనియర్ నాయకులతో కలిసి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కొలన్ హన్మంతరావు సమక్షంలో మంగళవారం చేరారు. కొలను వెంకటేశ్ ముధిరాజ్ కు కండువా కప్పి సాదారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు  దవగారి  రాజేందర్ రెడ్డి, యాస్కి పవన్ గౌడ్, మహ్మద్ రఫీ, ఎల్లారెడ్డి, హీసీఫ్, పార్టీ నాయకులు శంకర్ రెడ్డి, దశరథ్ ముదిరాజ్, అడ్డకేట్ కమలాకర్, కె.విఠల్, గాదె వినోద్, క్రిష్ణ యాదవ్, సంజీవ (ఎల్లేష్), షెహనాజ్ బేగం, దొంతుల రమేష్ ముదిరాజ్, శ్రీనివాస్ తో పాటు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. 
కొలన్ హన్మంతరావు సమక్షంలో తదితరులకు ఆహ్వనం... 

అబ్దల్ ఖాధర్ 39వ జన్మదిన ఘనంగా వేడుకలు

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; అబ్దుల్ ఖాదర్ 39వ జన్మదిన వేడుకలు గాంధీనగర్ ప్రాంతంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలకు హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాల్గొని జన్మదిన వేడుకలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యండ్ క్రాప్ట్ అసోసియేషన్ సభ్యులు  మహిళా నాయకులు, ఎండి.సాజిద్ ఖాన్, రాఘవులు, గడ్డం రాజేందర్ రెడ్డి, యాది రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్ రావు, లక్ష్మినాథ్, సాయి గౌడ్, రాజేందర్, నజీర్, ఫిరోజ్, ఇబ్రహిం తదితరులు పాల్గొన్నారు. 

కనక దుర్గ మండపంలో ఘనంగా నిర్వహించిన పూజలు...



తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; 
కనకదుర్గ మండపంలో ఘనంగా పూజలలతో పాటు అన్నధాన కార్యక్రమాన్ని నిర్వహించారు... ప్రతి యేటా ఘనంగా అమ్మవారి పూజలు, అన్నధానాలు నిర్వహించేవారని భక్తులు ఈ విధంగా సూచించారు. 


వివేక్ నగర్ లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; వివేక్ నగర్ లోని దుర్గామాత మండపం వద్ద బిజెవైఎం రంగారెడ్డి అర్చన్ కార్యదర్శి విజిత్ గారి ఆధ్వర్యంలో  అన్నధాన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశఆనికి  గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ గారు, శ్రీధర్ రెడ్డి, మాధవరం కాంతారావులు విచ్చేసి పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో నందు, నవీన్, పవన్, వినోద్, శేఖర్, పశుపతి, వినయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 


కళోజి హెల్త్ యూనివర్సీటీని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్జతలు

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; కళోజి హెల్త్ యూనివర్సీటీ మంజూరు చేసినందుకు కేసీఆర్, ఉపముఖ్యమంత్రి రాజయ్యకు  కృతజ్జతలు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అతి ఉన్నతమైన హెల్త్ యూనివర్సీటీని ఓరుగల్లు జిల్లాల్లో  పెట్టడం ఎంతో హర్షనీయమని టిపియుఎస్ రాష్ట్ర కార్యదర్శి  వశపాక నర్సింహ అన్నారు.  ఇందులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.  రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిని కలిశారు. ఈ  సమావేశానికి మాదవ్ మెదక్ అధ్యక్షులు, రవి సత్య నాయక్ మధన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. 



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలా... అనే పాటలతో సందడి...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పువ్వులను పేర్చి బతుకమ్మ పాటలు పాడారు. 
బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి వెళ్తున్న మహిళలు
ఆకట్టుకంటున్న బతుకమ్మ....

Monday, 29 September 2014

ఆన్ లైన్ ఫోన్ల అమ్మకాలకు అడ్డగా మారిన ఫ్లిప్ కార్ట్...

2 నిమిషాల 4 సెకన్లలో 20 వేల స్మార్ట్ ఫోన్ల అమ్మకం
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఆన్ లైన్ లో మొబైల్ అమ్మకాల జోరు మాత్రం అంతింత కాదు... ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ లో ఓ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్లు 20 వేల స్మార్ట్ ఫోన్ లు 2.4 సెకన్లలో అమ్ముడయ్యాయి. ఫోన్ కావాలంటే 19 వ తేది వరకు వేచి ఉండాలని ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఫేర్కొంది. జియోమీ ఫోన్ ను ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచగా అది కేవలం 2 నిమిషాల 4 సెకన్లలోనే 20 వేల ఫోన్లు అమ్ముడయ్యాయి. అదే కోవాకు చెందిన ఫోన్లను 19వ తేదీనా మరిన్ని ఫోన్లను విక్రయించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ లో డాట్ కామ్ లో తేలింది...

అక్టోబర్ 2న జెఆర్ సి కన్వెషన్ భారతదేశ అభివృద్ది దశపై సదస్సు

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; పొలిటికల్, విద్యా, ఆరోగ్య, వైద్య రంగాలలో దేశవ్యాప్తంగా మంచి అభివృద్ది జరిగే విధంగా జెఆర్ సి  కన్వెషన్ సెంటర్ లో  అక్టోబర్ 2న నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు మంథాన్ సంవాద్ ప్రతినిధులు కె.మాధవరావు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్ బుక్, యాహూ గ్రూప్స్ మంథాన్ సామ్ వాద్ ను అక్కడికి వచ్చే వారికి ఒక వేదికగా నిలుస్తుందన్నారు. అక్టోబర్ 2న జరిగే కార్యక్రమానికి పలువురు వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన  స్పీకర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్ గాంధీ, వింఆర్.విక్రమ్, చంక్రభారతి తదితరులు పాల్గొన్నారు. 

మాండరీన్ శ్రీనివాస్ సేవలు మరువలేనివి; రామస్వామి...

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; సంగీతంలోనూ  ఇంటర్నేషనల్ గుర్తింపు పొందిన మాండిరీన్ శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలు చేశారని రామస్వామి అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని ఎన్ కెఎంఎస్ గ్రాండ్ లో శ్రీనివాస్ సంస్మరణ సభను  ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రామస్వామి మాట్లాడుతూ అతను చాలా గొప్ప వ్యక్తి అని అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఝశర్మ తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 27 September 2014

నగరంలో ఐడన్ ఎస్ఇవో ఆధ్వర్యంలో గూగుల్ భర్త్ డే

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; ఐడన్ ఎస్ఇవో ఫేస్ బుక్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం గూగుల్ భర్త్ డే కేకును ఐడన్ ఎస్ఇవో గ్రూప్ నిర్వాహకులు చక్రపాణి అనుముల కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా చక్రపాణి అనుముల మాట్లాడుటూ గూగుల్ భర్త డే చేసుకోవడం  ఆనందంగా ఉందన్నారు.  
కేక్ ను కట్ చేస్తున్న ఐడన్ ఎస్ఇవో గ్రూప్... 

మెట్రో పోలీస్ వరల్డ్ కాంగ్రెస్ 2014

ప్రపంచంలో టాప్ టెన్ సిటిలలో ఒకటిగా హైదరాబాద్... తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్;  మెట్రో పోలీస్ వరల్డ్ కాంగ్రెస్ 2014 ఇంటర్నేషనల్ కాన్ఫ్ రెన్స్ ను    హైదరాబాద్ హైటెక్స్ లో  హెచ్ఐసిసిలో  అక్టోబర్ 7 నుంచి 10 వరకు  సమావేశాన్ని ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  హైదరాబాద్ ను ప్రపంచం టాప్ టెన్ సిటిలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రపంచంలోని వివిధ నగరాలు మెల్ బోర్న్ తదితర సిటిలను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు సన్నహాలు చేస్తున్నారు. టెక్నాలజి, విద్యారంగం, ఐటి, స్పోర్ట్స్ లలో మొదటగా  హైదరాబాద్ పేరు  వినిపించడానికి సన్నహాలు జరుపుతున్నారు. 

మరో నాలుగేళ్లలో ప్రజలకు 24 గంటల కరెంట్ ఇస్తాం; కేటిఆర్


తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్;  నాలుగు సంవత్సరాల తరువాత ప్రజలకు 24 గంటల కరెంట్ ఉండేటట్లు చేస్తామని తెలంగాణ ఐటి, పంచాయితీ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం ట్యాంక్ బండ్ హోటల్ మ్యారిట్   (ఇఎస్ బిఎం ) ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్ ఫాక్టరింగ్ అనే సమావేశాన్నికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటిఆర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ ప్రభుత్వం మంచి సాఫ్ట్ వేర్ సెక్టార్ ను  ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిసిటీ  హార్డ్ వేర్ పాలసీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ను ఐటిఐఆర్ గా తీర్చి దిద్దేందుకు 50 వేల కోట్లు ను వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో (ఇఎస్ బిఎం ) అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. 

Friday, 26 September 2014

రహ్మత్ నగర్ లో కార్పొరేటర్ పర్యటణ...

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; రహ్మత్ నగర్, రాజీవ్ నగర్, హెచ్ ఎఫ్ నగర్ ఫేజ్ తదితర ప్రాంతాల్లో  కార్పొరేటర్  బండపల్లి చంద్రమ్మ పలు ప్రాంతాల్లో పర్యటించారు.  

ఘనంగా బతుకమ్మ సంబరాలు...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఖైరతాబాద్ పరిధిలో బతుకమ్మ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యా  సంస్థలు,  ప్రభుత్వ  కార్యాలయాలు, కాలనీల్లో  వేలాది మంది  మహిళలు, యువతులు జనాలు కిటకిలాడారు.  రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మను ఆటాపాటలతో పూజిస్తూ ఆనంద పరవశులవుతున్నారు.  బతుకమ్మలను చేసి వాడవాడల సంబరాలు జరుపుకున్నారు. 

మరిన్ని ఫోటోలు...




Wednesday, 24 September 2014

వాడవాడలో బతుకమ్మ ఉత్సవాలు...


బతుకమ్మలను నీటిలో వదులుతున్న మహిళలు... 

గ్రేటర్ పరిధిలో బతుకమ్మ ఉత్సవాలు... 
ఎక్కడ చూసిన బతుకమ్మ పేరే మారుమోగుతుంది...
తెలంగాణ వెబ్ న్యూస్; హైదరాబాద్; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ పండుగను  ఉల్లాసంగా  ఉత్సాహంగా  జరుపుకుంటున్నారు. రంగురంగుల పువ్వులు, ముచ్చటైన తెలంగాణ బతుకమ్మ పాటలు వింటేనే మనస్సు పరవశించిపోతుంది... అది మన తెలంగాణ ప్రత్యేకం అని చెప్పుకోవాలి... బతుకమ్మ పాటలు తొమ్మిది రోజుల పాటు మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఎక్కడెక్కడో ఉన్న ఆడపడచులందరూ ఈ పండక్కి ఇళ్లు చేరుకోవడం ఒక సంప్రదాయం... మంగళహారతులతో తొమ్మిదో రోజు గౌరమ్మను చేసి చెరువుల్లో వదలడం ఆనవాయితీగా వస్తోంది... తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రం ప్రత్యేకంగా కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, అమీర్ పేట, దుండిగల్, కెపిహెచ్ పి కాలనీ, బాలనగర్, జీడిమెట్ల, హైదర్ నగర్, పేట్ బషీరాబాగ్, జేఎన్ టీయూ, షాపూర్  ప్రాంతాల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ పండుగల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

మరిన్ని ఫోటోలు; 








Tuesday, 23 September 2014

20వ తెలుగు రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు...


తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; డాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావుగారి 20వ తెలుగు రాష్ట్ర స్థాయి నాటిక  పోటీలు మంగళవారం జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పలువురు ప్రముఖులు పాల్గొని గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. 


మరిన్ని ఫోటోలు...




పర్యావరణాన్ని కాపాడితేనే పండగ; ఫారెస్ట్ అకాడమి డైరెక్టర్ రఘువీర్

కూకట్ పల్లిలో  పర్యావరణం గురించి ప్రెస్ మీట్... 
పర్యావరణ కాలుష్య నియంత్రపై ప్రేమ్ ను విడుదల చేస్తున్న రఘువీర్ తదితరులు... 
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;  ఐ గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణం కాపాడితే పండగ దానిపై విలేకరుల సమావేశాన్ని కూకట్ పల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ అకాడమి డైరెక్టర్ రఘువీర్  పాల్గొని మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు పలు సూచనలు ఇచ్చారు. పర్యావరణం, గాలి, నీరు విషతుల్యం కాకుండా చూసే భాద్యత ఉందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతటకు ఏదైనా మట్టతోనే తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో  విజయ్ రామ్, దొరరాజు,  రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులు విజయ భాస్కర్, జిగీసా ప్యాకేజింగ్ సంస్థ  మామిని కోగంటి  తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని ఫోటోలు; 



ఇండస్ట్రీలో పని చేసే కార్మికులకు న్యాయం చేస్తా; నాయిని

పని చేసే కార్మికులు జీతాలు సరిపోవడం లేదు...
కాలం గడిచినా పర్మినెంట్ చేయడం లేదు; సధా నంద్ గౌడ్
  హెచ్ ఎంఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయిని నర్సింహ రెడ్డిని సన్మానిస్తున్న సధా నంద్ గౌడ్ తదితరులు... 
 తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్;  హైదరాబాద్  ఇండస్ట్రిస్  సనత్ నగర్ లో పని చేసే  కార్మికులకు న్యాయం చేసే విధంగా  పోరాటం చేస్తానని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. మంగళవారం సుందర్ నగర్ కాలనీలో హెచ్ ఎంఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయిని నర్సింహ రెడ్డిని సన్మానించారు. ఈ సన్మాన సభలో నాయిని మాట్లాడుతూ సనత్ నగర్  ఆ ఇండస్ట్రీలో పని చేసేవారికి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారు. ఈ సందర్బంగా హెచ్ఎంఎస్ పార్టీ సనత్ నగర్ అభ్యర్థి సదానంద్ గౌడ్ మాట్లాడుతూ సంస్థలో పని చేసేవారికి ట్రైనింగ్ లో 3 వేల నుంచి ఇస్తున్నప్పటి నుంచి పని చేస్తున్నామన్నారు. ట్రైనింగ్ మూడు సంవత్సరాల తరువాత 15 వేల వరకు ఇస్తామని హామీ కూడా ఇచ్చారన్నారు. అది వారు నిలబెట్టుకోలేకపోయారన్నారు.  ప్రత్యర్థి అయిన సంజీవరెడ్డి  ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు.  గత రెండు సంవత్సరాల నుంచి నోటీసులు ఇవ్వకుండా ఎలక్షన్లు పెడతామని వారే నిర్ణయం తీసుకున్నారన్నారు. మీరు గెలిచిన తరువాత మీకు ఏమి అడిగినా కాదనకుండా పని చేసి పెడతానని నాయిని హామీ ఇచ్చారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్, సందీప్, కన్నాలాల్ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని ఫోటోలు..

Monday, 22 September 2014

టీడీపా... టీఆర్ఎస్సా..?

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యం...
అక్టోబర్ 2 గాంధీ జయంతి, విజయదశమి మూహూర్థం... నిర్ణయం...  
అప్పటి వరకు తెలిసే అవకాశం... 
టీఆర్ఎస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్... 
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఫోటో)
తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్; ప్రచారం అయితే జరుగుతుంది కానీ... టీడీపా, టీఆర్ఎసా అనేది తేల్చుకోలేకపోతున్నారు...  గత కొంతకాలంగా తలసాని టీడీపీని వీడుతారనే ప్రచారం అందరికి తెలిసిన విషయమే పలు చానెళ్లలో కూడా ప్రసారాలు వచ్చాయి.  గ్రేటర్ ఎన్నికలు  దష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు సిద్దమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
  ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు,  సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ ను విడిచి టీఆర్ఎస్ కారు ఎక్కబోతున్నారా... అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రచారాలు మాత్రం జోరందుకున్నాయి. కానీ చాలా మందిలో టీఆర్ఎస్ లోకీ చేరే అవకాశం ఉందని కొందరూ... టీడీపీని విడుస్తారా... అని మరికొందరిలో అలఝడి రేగుతోంది...  తలసాని టీఆర్ఎస్ లోకి చేరే అవకాశం 90 శాతం ఉందన్న చర్చ కొనసాగుతుంది. తలసానితో పాటు కార్పొరేటర్లు, నాయకులు చేరే అవకాశం ఉంది. ఇది వరకే టీఆర్ఎస్ లో చర్చలు వినిపిస్తున్నాయి. కొంత మంది కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.  ఖైరతాబాద్ కు చెందిన వైసీపీలో నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డి  టీఆర్ఎస్ లోకి ఇదివరకే  చేరారు.   అటు సోషల్ నెట్ వర్కింగ్ తో ప్రచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కూడా తలసానితో పాటు  చేరే అవకాశం ఉంది... తలసానితో పాటు దసర పండగ చివరిలోగా టీఆర్ఎస్ లోకి చేరే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తలసానితో ఖైరతాబాద్ దానం నాగేందర్ (ఖైరతాబాద్  కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి), వివేక్ గౌడ్ (కుత్భల్లాపూర్ టీడీపీ),   తీగల కృష్ణారెడ్డి 
MLA, మంచి రెడ్డి కిషన్ రెడ్డి(  ఇబ్రహింపట్నం టీడీపీ ఎమ్మెల్యే),  మోత్కుపల్లి( టీడీపీ నాయకులు)వారి వారి అనుచరులు టీఆర్ఎస్ తో చేరుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి త్వరలో అక్టోబర్ 2న మూర్తం సిద్దమైనట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వలసలు ఇది వరకే చాలా మంది నాయకులు, కార్పొరేటర్లు చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా చేసుకున్నట్లు పలు రాజకీయ సీనియర్ నాయకులు వారి అభిప్రాయాలు చెబుతున్నారు.  త్వరలో  వచ్చే గ్రేటర్ పరిధిలో కార్పొరేట్ ఎన్నికలు దృష్టలో పెట్టుకొని టీఆర్ఎస్ లోకి వలసల బాట పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతన్నారు. 

Sunday, 21 September 2014

కొత్త ఆలోచనలకు ప్రతిరూపమే డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్...


డిజిటల్ మార్కెటింగ్ లో మంచి భవిష్యత్ ప్రణాళికలు... 
డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ సమావేశంలో మాట్లాడుతున్న ఐ ఢన్ ఎస్ ఈ వో నిర్వాహకుడు చక్రపాణి అనుముల
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; కొత్త ఆలోచనలకు ప్రతి రూపమే ఈ డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ అని  ఐ ఢన్ ఎస్ ఈ వో నిర్వాహకుడు చక్రపాణి అనుముల అన్నారు. ఆదివారం  ఈ థేమ్స్ డిగ్రీ కళాశాలలో  డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ పై ఈ వెంట్ ను  నిర్వహించారు. ఈ సందర్బంగా చక్రపాణి మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ లో మంచి భవిష్యత్ ఆధారడి ఉందన్నారు.  ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ లో డిజిటల్ గా షాపింగ్ చేయడంతో్ పాటు ఆన్ లైన్ వేదికలుగా మారుతున్నాయి.   ఈ కార్యక్రమంలో నటరాజ శర్మ, ఇమ్రాన్ మహ్మద్, శ్రీ రావు, అరుణ్ కొత్త పల్లి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని ఫోటోలు...