తెలంగాణ వెబ్ న్యూస్;అధికారంలోకి వస్తే అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలు తీరుస్తామని చెప్పిన టీడీపీ ఇప్పుడు మొండిచేయి చేపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అంగన్ వాడీ సమస్యలపై చర్చకు సమయం కోరితే స్పీకర్ అసహనం వ్యక్తం చేశారన్నారు.మహిళలు,మహిళాసాధికారత విషయంలో టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.అంగన్ వాడీ కార్యకర్తలకు బాధ్యతలు ఎక్కువ ....జీతం తక్కువ అనే విధంగా గొడ్డుచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు.అంగన్ వాడీ కార్యకర్తల జీతాల పెంపుపై టీడీపీ చిత్తశుద్ధి చూపడం లేదని రోజా వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment