తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు కరెంటు ఇస్తామని ముందుకొచ్చినా తీసుకోబోమని,అక్కడ ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు పంపిణీ చేయడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.తాము కష్టంలో ఉన్నపుడు చంద్రబాబు తమకు సహకరించకుండా మేలే చేశారని ,తాము సొంతంగా కరెంటు కష్టాలను అధిగమించామని తెలిపారు.వచ్చే అయిదేళ్లలో తెలంగాణ అభివృద్దికి రూ.ఆరు లక్షల కోట్లను వెచ్చిస్తామని తెలిపారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
No comments:
Post a Comment