తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ ప్రారంభించారు.తమ జీతాన్ని రూ.3 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ వారు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.సేకరించిన సంతకాల ప్రతులను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేయనున్నారు.తెలంగాణలో ప్రజాప్రతినిధుల వేతనాన్నిపెంచుతున్నట్టు నిన్న కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో తమ జీతాలు కూడా పెంచాలని నేడు ఎమ్మెల్యేలు సంతకాల సేకరణకు నడుం బిగించారు.
No comments:
Post a Comment