తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ బడ్జెట్ ను శాసనమండలి లో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టారు.శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు మోదలైన ప్రసంగం దాదాపు గంట పాటు సాగింది.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు వ్యవసాయ ఉద్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని తెలిపారు.రైతు సంక్షేమానికి,సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.ఏపీలో 2,500 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయని,వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం ప్రకటించింది.
No comments:
Post a Comment