తెలంగాణ వెబ్ న్యూస్;ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహారెడ్డి హత్య పై ఏపీ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. నర్సింహారెడ్డి హత్య పై విచారణ జరపాలని వైసీపీ పట్టుబట్టింది.ఈ హత్య కేసుతో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రతిపక్ష నేత జగన్ స్పష్టం చేశారు.15 రోజుల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారాన్ని చంద్రబాబుకు లింక్ పెట్టొచ్చా అన్న ఆయన ఈ వ్యవహారమూ అలాగే ఉందని అన్నారు.దీంతో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గందరగోళ నెలకొంది.
No comments:
Post a Comment