All meadia

 

Saturday, 6 December 2014

నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు దుర్మరణం...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: 
  • రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ మృతి
  • రాంగ్ రూట్ లో  వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ఢీ కొన్న వాహనం...
  • విరిగిపోయిన జానకీరామ్ కుడి చెయ్యి, కడుపులో తీవ్ర గాయాలు
  • ఆసుపత్రికి తరళిస్తుండగా కన్నుమూత
  • నల్లగొండ జిల్లా ఆకుపాముల 65వ నెంబర్ రహదారిపై దుర్ఘటన
  • హైదరాబాద్ లో జానకీ రామ్ నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
  • తరళి వచ్చిన సిని, రాజకీయ ప్రముఖులు...
  • తెలంగాణ సీఎం, వైఎస్ జగన్ సంతాపం...


మునగాల, కోదాడ, హైదరాబాద్: టీడీపీ పొలి ట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్(42) శని వారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్-విజయవాడ 65 నంబర్ జాతీ య రహదారిపై నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ఘటన జరి గింది. జానకిరామ్ ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్‌రూట్‌లో వెళుతున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొంది. ఈ సమయంలో వాహనాన్ని నడుపుతున్న జానకిరామ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న కోదాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా.. జానకిరామ్ మృతదేహాన్ని శనివారం రాత్రి 8 గంట లకు కోదాడ నుంచి హైదరాబాద్‌కు తరలించా రు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని హరికృష్ణ ఇంటికి తరలించారు.

హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన కేసీఆర్, చంద్రబాబు, జగన్

ఏపీ ఆన్ లైన్, హైదరాబాద్: జానకిరామ్ మృతి పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సం తాపాన్ని వ్యక్తం చేశారు. వార్త తెలిసిన చంద్రబాబు హరికృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి వై.సత్యనారాయణ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు, ఏపీ మంత్రులు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నారా లోకేశ్ తదితరులు సంతాపం ప్రకటించినవారిలో ఉన్నారు. తన సోదరుని కుమారుడి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment