All meadia

 

Thursday, 18 December 2014

క్రైస్తవులకు సీఎం వరాలు..

హైదరాబాద్ లో 10 కోట్లతో క్రిష్టియన్ భవన్ నిర్మిస్తాం...
క్రిస్మర్ పండగకి సెలవులు రెండు రోజులు...
క్రైస్తవుల కోసం క్రైస్తవ బోర్డు ఏర్పాటు... 
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:  క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల ఝల్లు కరిపించారు. తెలంగాణ రాష్ట్రంలో  క్రైస్తవుల కోసం 10 కోట్లతో క్రిష్టియన్ భవన్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. రేపే జీవోను జారీ చేస్తామన్నారు.  గురువారం లలితా కళా భవనంలో 36వ యూనైటెడ్ క్రిష్టమస్ సెలబ్రెషన్స్ కార్యక్రమంలో  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అర్చ్ బిచప్ తుమ్మబాల, యూనైటెడ్ చైర్మన్ కె.రహ్మంత్ పీటర్,  నగరంలోని వివిధ జడ్పీలు,  తమ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment