హైదరాబాద్, తెలంగాణ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం జరగనుంది. ఈ కేబినెట్లో మరో ఆరుగురికి చోటు దక్కనుంది. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చందూలాల్, ఇంద్రకరణ్రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు తుమ్మల, తలసాని బహిరంగంగా కటౌట్లు పెట్టుకోవడంతో వారి పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మంత్రుల పేర్లు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఇప్పటికే కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment