హైదరాబాద్,2005 సంవత్సరం కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు (ఎక్సేంజ్) ఇక పది రోజుల సమయం మాత్రమే ఉంది.రూ.500,రూ.1000 కరెన్సీ నోట్లు సహాఇతర నోట్లను మార్చుకునేందుకు జనవరి1,2015ను తుది గడువుగా భారత రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) విధించింది.రిజర్వు బ్యాంకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 2005 కంటే ముందున్న నోట్లలో రూ.52,855 కోట్ల విలువైన 144.66 కోట్లకరెన్సీ నోట్లను ఇప్పటికే మార్పిడి చేసింది.నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, 2005 తరువాత తయారైన కరెన్సీ నోట్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కేంద్రీయ బ్యాంకు తెలిపింది.
No comments:
Post a Comment