తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకిరామ్ మృతి చెందడం చాలా బాధకరమని కాంగ్రెస్ నేత, ప్రముఖ నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం జానకిరామ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఆయన హరికృష్ణను పరామర్శించారు. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కారు డ్రెవ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరిస్తే ఇలాంటి అవాంతరాలు జరుగకుండా కొంతమేరకు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి విన్నవించారు.
No comments:
Post a Comment