తెలంగాణ వెబ్,న్యూస్;పదో తరగతి సిలబస్ ను సనవరి 15 నాటికి పూర్తి చేయించి, గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆప్రకారం విద్యా బోధన సాగిస్తున్నట్టు యలమంచిలి డీప్యూటీ డీఈవో బి.లింగేశ్వరరెడ్డి చెప్పారు.సోమవారం మండలానికి వచ్చిన ఆయన మేడివాడ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు.యలమంచిలి డివిజన్ లో ప్రభుత్వ,ప్రైవేటు స్కూలల్లో ఈ ఏడాది 20 వేల మంది పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్టు చెప్పారు.గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలో జిల్లా ఉత్తీర్ణత శాతం90.8 శాతం సాధించామని తెలిపారు.ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
No comments:
Post a Comment