All meadia

 

Thursday, 11 December 2014

కేసీఆర్‌ పాలనా సమర్థుడు
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలనా సమర్థుడని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కొనియాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవాలని, రాష్ట్ర అభివృద్ధికి సీపీఐ సహకరిస్తుందనిచెప్పారు. నల్లగొండ జిల్లా రాజాపేటలోబుధవారం ఆరుట్ల కమలాదేవి- రాంచంద్రారెడ్డి ఫౌండేషన్‌, రామానందతీర్థ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన ఆరుట్ల దంపతుల చరిత్ర మరువరానిదని అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించడానికి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలోఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఆరుట్ల ఫౌండే షన్‌ వ్యవస్థాపకులు సుశీలాదేవి, ప్రొఫెసర్‌ కిశోర్‌రెడ్డి పాల్గొన్నారు. 

No comments:

Post a Comment