All meadia

 

Monday, 29 December 2014

విలీన విద్యపై అవగాహన కల్పించాలి

తెలంగాణ వెబ్,న్యూస్;జిల్లాలోని వికలాంగులకు,వారి తల్లిదండ్రులకు భవిత విద్యా వనరుల కేంద్రాల ద్వారా అందిస్తున్న విలీన విద్య పై అవగాహన కల్పించాలని డీఈవో రాజేశ్ తెలిపారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఈడీ కళాశాల సమావేశ మందిరంలో విలీన విద్యావనరుల కేంద్రాల ఐఈ ఉపాధ్యాయులకు నిర్వహించిన కార్యక్రమంలో డీఈవో మాట్లాడారు.మండలాలో క్రమం తప్పకుండా ఫిజియోథెరపి శిబిరాలు నిర్వహించాలని ,ముఖ్యంగా ఇంటివద్ద విద్యను తప్పకుండా ఆందించాలన్నారు.వికలాంగులు అన్ని రంగాల్లో రాణించేలా,సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకునేలా కృషి చేయాలన్నారు.వైకల్యం ఏవిధంగా వస్తుంది.దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు,వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు,తదితర అంశాలపై వికలాంగుల తల్లిదండ్రులకు ఆవగాహన కల్పించాలన్నారు.

No comments:

Post a Comment