All meadia

 

Friday, 26 December 2014

పాఠ్య పుస్తకాల గుట్టు రట్టు

తెలంగాణ వెబ్,న్యూస్;ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్నాయి.పాఠ్యపుస్తకాల ముద్రణశాఖ డైరెక్టరు నుంచి వచ్చిన ఆదేశాలను తారుమారు చేస్తూ 36 వేల పుస్తకాలను పశ్చిమబెంగాల్ కు (అక్కడి తెలుగు బడులకు) పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.జిల్లా  విద్యాశాఖాధికారికి ఎలాంటి సమాచారం లేకుండా గోదాము ఇంఛార్జి ఈ తతంగానికి తెర లేపారు.సకాలంలో విషయం తెలుకున్న విద్యాశాఖ అధికారులు పుస్తకాల తరలింపును అడ్డుకొని,లారీలను గోదాములోనే ఉంచారు. ఈ తరలింపు వెనుకకొందరు రాష్ట్ర స్థాయి అధికారుల హస్తం ఉన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment