తెలంగాణ వెబ్,న్యూస్;సకాంలో ఇంటి పన్నులు చెల్లించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు కొత్త పేట సర్పంచి జగదీశ్వర్ మంగళవారం తెలిపారు.ప్రస్తుతం పన్ను వసూళ్ల కార్యక్రమం కొనసాగుతుందన్నారు.ఈ సంక్రాంతి వరకు పన్నులు చెల్లించిన వారిలో ముగ్గురిని డ్రా పద్ధతిలో ఎంపిక చేసి తన సొంత డబ్బుతో బహుమతులు ఇస్తానని వివరించారు.పండగ రోజు పంచాయతీ కార్యాలయం వద్ద డ్రా తీస్తామన్నారు. నిర్ణీత గడువులోపు పన్నులు చెల్లించి ప్రోత్సాహకం గెలుపొందాలని సర్పంచి ప్రజలకు విజ్న్ ప్తి చేశారు.
No comments:
Post a Comment