తెలంగాణ వెబ్ న్యూస్;ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో విడివిడిగా ఎం సెట్,ఇతర వృత్తి విద్య ప్రవేశ పరీక్షలు జరగబోతున్నాయి.ఉమ్మడిగా పరీక్షలు జరపాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విడిగా పరీక్షలు నిర్వహించే దిశగా సమాలోచనలు జరుపుతోంది. ఉమ్మడి పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తదుపరి చర్యల పై దృష్టి పెట్టింది.ఉమ్మడిగా పరీక్షలు జరిపేలా న్యాయం పోరాటం చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ విద్యార్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు అందుకు ఇది తగిన సమయం కాదని భావిస్తోంది. సమయాభావం దృష్ట్యా ఆ ఆలోచనను తాత్కాలికంగా పక్కనబెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. స్థానికేతర కోటాలో ఇక్కడి వారు అక్కడ,అక్కడి వారు ఇక్కడ చదవాలంటే రెండు చోట్లా పరీక్షలు రాయాల్సిందే.
No comments:
Post a Comment