All meadia

 

Monday, 26 January 2015

చదువుకున్నోళ్లే ఓ టేయట్లేదు

తెలంగాణ వెబ్ న్యూస్;ఎన్నికల్లో ఓటు వేయకపోతే ..సమాజంలో ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లేనని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంచి నాయకుణ్ని ఎన్నుకొని ..దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని  ఓటర్లకు పిలుపునిచ్చారు.నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వాళ్లే పోలింగ్ కేంద్రానికి రావడానికి బద్ధకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పాల్గొనని వారికి ప్రభుత్వాన్ని సైతం విమర్శించే హక్కు లేదన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్చందంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్గ్  ఆప్తి చేశారు.

No comments:

Post a Comment