.
Wednesday, 28 January 2015
తేది-28-01-2015 ప్రతికా ప్రకటన ఉపాధి హమీ కూలీ పేదల ప్రజల హక్కు- పంచాయితీరాజ్ శాఖ ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు • మహత్మగాందీ జాతీయ ఉపాధిహమీ పథకం పనులను వేంటనే గ్రామాల్లో ప్రారంభించాలి • ఉపాదిహమీ పథకాన్ని మరింతగా మెరుగ్గా ఉపయోగించుకోవాలి • యంపిడివోలతో కలెక్టర్లు వారానికోసారి సమీక్ష నిర్వహించాలి • యంపిడివోలు గ్రామాలల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైతే జిల్లాకలెక్టర్లు సైతం గ్రామాల్లోకి వెళ్లాలి మహత్మగాందీ జాతీయ ఉపాధిహమీ పథకం పనులను వేంటనే గ్రామాల్లో ప్రారంభించాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామా రావు జిల్లా కలెక్టర్లను అదేశించారు. సచివాలయంలోని సిభ్లాక్ లో కలెక్టర్లతో ఉపాదిహమీ పథకంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాదిహమీ పథకం పనులు జిల్లాల్లో జరుగుతన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్గోండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లా ఉపాదిహమీ పథకం పనులు బాగా మెరుగుపరుచాల్సిన అవసరం ముందని జిల్లా కలెక్టర్లకి తెలిపారు. కేంద్రం ఉపాదిహమీ పథకం పై పరిమితులు విధిస్తుందన్న నేపథ్యంలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని ఉభయసభలు తీర్మానం చేసాయని గుర్తు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment