All meadia

 

Thursday, 22 January 2015

విజవాడ నుంచి ‘ఇంటర్’పరీక్షలు

తెలంగాణ వెబ్,న్యూస్;నవ్యాంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు విజవాడ నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇందుకోసం ఎస్ఆర్ఆర్ కళాశాలలో క్యాంప్ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఏపీ ఇంటర్ బోర్డు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్లు సమాచారం.ఇంటర్ బోర్డు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ,పరీక్షల నిర్వహణను రాష్ట్ర రాజధాని ప్రాంతం నుంచే నిర్వహించటం మంచిదన్న అభిప్రాయంతో బోర్డు ఈ ప్రతిపాదన  చేసింది.విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండటంతో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.ఇంటర్ బోర్డు సెక్రెటరీ రామశంకర్ నాయక్ ఇప్పటికే పలు మార్లు  ఈ కళాశాలను పరిశీలించారు.ఇక్కడి నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుని పర్యవేక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఇంటర్ బోర్డువర్గాలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment