తెలంగాణవెబ్,న్యూస్;పింఛన్లు,ఆహార భద్రత కార్డల జారీలో జాప్యం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగర అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.తక్షణమే అర్హులందరికీ వాటిని మంజూరు చేయాలని స్పష్టం చేశారు.గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు వస్తున్నానంటూ కేవలం నాలుగు గంటల ముందు సమాచారం ఇచ్చి వచ్చిన సీఎం...రాత్రి 8 గంటల వరకు వరంగల్ నగరంలోని మురికి వాడల్ని సందర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం,సాకరాశికుంట.గిరిప్రసాద్ నగర్ వాడల్లో తిరిగి అక్కడి ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. ప్రధానంగా పింఛన్లు,ఆహారభద్రత కార్డుల జారీకి అర్హుల విచారణ,ఎంపిక తీరు, పేదలక గృహాల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
No comments:
Post a Comment