All meadia

 

Thursday, 22 January 2015

కేసీఆర్ ..మాటలమారాఠీ

తెలంగాణ వెబ్ న్యూస్;సీఎం కేసీఆర్ మాయలోడు,మాటలమరాఠీ అని తెలంగాణ తెదేపా శాసనసభా పక్ష(టీటీడీఎల్పీ) ఉప నేత రేవంత్ రెడ్డి అన్నారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తగదన్నారు. బుధవారం ఆయన  ఎన్టీఆర్ భవన్ లో మీడియా తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై,మంత్రి మహేందర్ రెడ్డి వ్యాఖ్యల పై తీవ్రంగా ధ్వజమెత్తారు.వచ్చేనెలలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తారని తాము ప్రకటించిన మురుక్షణమేతెరాస నేతల  గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని  మంత్రి మహేందర్ రెడ్డి అన్నారని ఇది ప్రభుత్వ నిర్ణయమా,తెరాస పార్టీ నిర్ణయమో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి విపరీత పోడకలు వినాశనానికి దారి తీస్తాయన్నారు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించేందుకు తాము  పోరాడతామన్నారు.చంద్రబాబుకు దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని,ఆయన పర్యటనను అడ్డుకుంటామనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

No comments:

Post a Comment