All meadia

 

Monday, 19 January 2015

తేది-19-01-2015 పత్రికా ప్రకటన వాటర్ గ్రిడ్ కోసం ప్రత్యేక వీడియో కాన్పరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు Ø వాటర్ గ్రిడ్ కోసం ప్రత్యేక వీడియో కాన్పరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభం Ø జిల్లా అర్ డబ్యూయస్ అధికారులతో తొలి కాన్ఫరెన్సు నిర్వహించిన మంత్రి Ø లైన్ సర్వే, ఇంటెక్ వెల్స్ పై అధికారలుతో విడియో కాన్పరెన్స్ Ø లైన్ సర్వేని ఏట్టిపరిస్ధితుల్లోను నెలఖరుకి పూర్తి చేయాలని అదేశం Ø మెత్తం సూమారు 40 వాటర్ గ్రిడ్ సంభందిత కార్యాలయాలను వీడియో  కాన్పరెన్సుతో అనుసంధానం Ø వాటర్ గ్రిడ్ పనుల పరిశీలన కోసం మహబూబ్ నగర్ ఏల్లూర్ లో క్షేత్ర పర్యటన సోమవారం అర్ డబ్యూయస్ ఈయన్ సీ కార్యాలయంలో విడియో కాన్పరెన్స్ సౌకర్యాన్ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు ప్రారంభించారు. మెత్తం వాటర్ గ్రిడ్ కార్యలయాల నెట్ వర్క్ ని విడియో, టెలీ కాన్పరెన్పులతో అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా జిల్లా ఏస్ ఈ కార్యలయాలు- కేంద్ర అర్ డబ్యూయస్ కార్యలయాయంలో విడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించారు. జిల్లాల్లోని యస్ ఈ కార్యలయంలోని ఏస్ ఈ, మరియు ఇతర అర్ డబ్యూయస్ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వానికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైన పథకమని , ఇందుకోసం డిపార్టమెంట్ మెత్తం కష్టపడి పని చేయాలని వారిని కోరారు. ప్రతి అదివారం విడియో కాన్పరెన్సు ఉంటుందని, వాటర్ గ్రి డ్ పనులు క్షేత్ర స్ధాయిలో ప్రారంభం అయ్యేదాక కలసి పనిచేద్దామన్నాని ఉద్యోగులను కోరారు. వాటర్ గ్రిడ్ పనులను మంత్రి కె.తారకరామారావు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వాటర్ గ్రిడ్ లైన్ సర్వేను వేంటనే పూర్తి చేయాలని, ఇందుకోసం అవసరమైతే అదనపు టీంల సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ఏట్టిపరిస్ధితుల్లో ఈనెలకరు నాటికి సర్వేపనులు పూర్తి చేయడంతోపాటు ఇంటెక్ వెల్స్ టెండర్లు పిలవాలని, వచ్చెనెల మెదటి వారంలో పనుల ప్రారంభించాలని కోరారు. ఇంటెక్ వెల్స్ నిర్మాణం వచ్చే మే మాసాంతం నాటికి సెప్ స్టేజ్ కి రావాలని, దీని భాద్యత పూర్తిగా జిల్లా ఏస్ ఈలదే అని తెలిపారు. ఇంటెక్ వెల్స్ నిర్మానంలో అనుభవం, నిర్మాణ సామర్ధ్యం ఉన్న కంపెనీలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు మెత్తం వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన కేంద్రకార్యలయాధికారుల నుంచి వారి పర్యటన వివరాలు అడిగి తెల్సుకున్నారు. వాటర్ గ్రిడ్ కి ఉన్న ప్రాధాన్యత ధృష్య్టా పరిపాలనా అనుమతులు గంటల్లోనే( రోజులు తరబడి కాకుండా, గంటల్లోనే) ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు వచ్చే నెలలో నల్గోండలో ప్రారంభించబోయే పైలాన్ పనులపైన సమీక్ష నిర్మించారు. పనులు పూర్తి కావస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కార్యలయంలో చర్చించి పైలాన్ అవిష్కరణ తేదిని ఖరారు చేయాలన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్ధాయిలో పరిశీలించేందుకు మంత్రి కె.తారక రామా రావు మహబూబ్ నగర్ జిల్లాలో  ఏల్లూరులో పర్యటించనున్నారు. ఏల్లూర్ వద్ద నిర్మించనున్న ఇంటెక్ వెల్ తాలుకు సర్వే, డిజైన్, నిర్మాణానికి సంబందించిన పనులను పరీశీలించనున్నారు. ఇక పైన వాటర్ గ్రిడ్ పనుల పరిశీలన కోసం క్షైత్ర స్ధాయితో  వరుసగా పర్యటించి పనులను పరీశీలిస్తామన్నారు.           ప్రతికా ప్రకటన-2  గ్రామపంచాయితీలు విద్యుత్ బిల్లులు చెల్లించాలి- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు గత ప్రభుత్వాల మాదిరిగా గ్రామ పంచాయితీ నిధుల్లోంచి నేరుగా మినహయించుకోకుండా నేరుగా పంచాయితీలక నిధులు ఇచ్చినందున గ్రామ పంచాయితీల్లో పేరుకు పోయిన విద్యుత్ బకాయిలను చెల్లించాలని మంత్రి కె.తారక రామ రావు తెలిపారు. పంచాయితీలపై నమ్మకంతో 1350 కోట్ల రూపాయాల 13 అర్ధిక సంఘం నిధుల్లో 70శాతం నేరుగా పంచాయితీలకి ఇచ్చిన నేపథ్యంలో పంచాయితీలు విద్యుత్ బకాయిలకి కొంత కేటాయించుకుని భాకీలను చెల్లించాలన్నారు. తమ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకి అధికారుల ఇవ్వడానికి ముందుకు వచ్చిన నేపథ్యం పంచాయితు భాధ్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. సంవత్సరాలపాటు స్ధానిక సంస్ధలకి ఏన్నికలు జరపక పోవడంతో కేంద్రం నుంచి రావల్సిన నిధులు రాలేవని, దీంతో గ్రామ పంచాయితీలు నిధులు లేక బకాయిలు పేరుకు పోయాన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయితీల విద్యత్ బకాయిల భారం గత ప్రభుత్వాల అలసత్వ ఫలితమన్నారు. సచివాలయంలోని డి బ్లాక్ లో విద్యుత్  శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తోపాటు డిస్కమ్ ల విద్యుత్ అధికారలు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని తాగునీటి పంపుసెట్లకి విద్యుత్ కనెక్షన్లు ఏట్టి పరిస్ధితుల్లోను తోలగించవద్దని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. గ్రామ పంచాయితీలకి విద్యుత్ భారం తగ్గించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్యాయాలపై దృష్టి సారించాలని విద్యుత్ శాఖధికారులకి సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లోని విద్యుత్ దీపాలు నిరంతంరం వెలగకుండా కట్టడి చేసే మూడవ వైర్ ఏర్పాటు కోసం 14 కోట్ల రూపాయాలను డిస్కంలకి చెల్లించే అంశాలన్ని పరిశీలించాని పంచాయితీ రాజ్ ప్రిన్పిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ని అదేశించారు. దీంతో పాటు కేంద్రం ప్రారంభించిన నూతన ఏల్ ఈడీ బల్బుల వినియోగం పైన కార్యచరణ చేపట్టాని కోరారు. దీంతో పాటు గ్రామాల్లోని నీటి పంపులకి సోలార్ పంపుసెట్లు, వీది దీపాలకి సోలార్ ల్యాంపుల ఏర్పాటుని పరీశీలీంచాలని కోరారు. ఈ సమావేశంలో డిస్క్ మ్ సియండిలు రఘుమా రెడ్డి, వెంటక్ నారాయణ, ఏనర్జీ శాఖ సెక్రటరీ అరవింద్ కూమార్, పంచాయితీరాజ్ కమీషన్ మురళి, ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఇరు శాఖ అధికారులు పాల్గోన్నారు.  

.

No comments:

Post a Comment