All meadia

 

Sunday, 25 January 2015

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరి

తెలంగాణ వెబ్ న్యూస్;వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి రాజ్ భవన్ లో తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి  ముక్యమంత్రి కేసీఆర్,మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్,ఈటెల,జోగు రామన్న,ఎంపీ కేకే తదితరులు హాజరయ్యారు.
       ఇటీవల రాష్ట్రంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన స్థానంలో కేసీఆర్ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment