All meadia

 

Thursday, 22 January 2015

అయోమయంలో టెన్త్ విద్యార్థులు

తెలంగాణ వెబ్,న్యూస్;కొత్త పాఠాలు..పాత విధానంలో పరీక్షలు 
                             ఇప్పటికీ పూర్తికాని పాఠ్యప్రణాళిక
                              మార్చి 26 నుంచి పది పరీక్షలు
     విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్ధేశం చేసే పదో తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి.ఇంకా 65 రోజులు మాత్రమే ఉంది.వీటిలో ఆదివారాలు,సెలవు దినాలు మినహాయిస్తే మిగిలింది రెండు నెలల్లోపే.ఈ వ్యవధిలోనే విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.ప్రభుత్వం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు గంటల్లో విద్యార్థులను ఉపాధ్యాయుులు చదివిస్తున్నారు.అయితే  ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు రావడం,ఆపుస్తకాలు నిరంతరం సమగ్ర మూల్యాంకనంలో ఉండటం ఈ పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం,సకాలంలో పాఠ్య ప్రణాళికల బోధన పూర్తికాకపోవడం వంటి అంశాలు పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.

No comments:

Post a Comment