తెలంగాణ వెబ్,న్యూస్;మండలంలోని కరణ్ కోటలో ఆహారభద్రత కింద నాణ్యతలేని బియ్యం అందజేయడంతో తీసుకునేందుకు స్థానికులు నిరాకరించారు.గ్రామం లోని చౌక దుకాణంలో శనివారం డీలరు రెడ్డిమాణెప్ప బియ్యం పంపిణీ చేశారు.అంతా పురుగు పట్టి ఉండటంతో నాణ్యత లేకుండాపోయింది.గమనించిన స్థానికులు విషయాన్ని వీఆర్ఓ సతీష్ రెడ్డి,సర్పంచి శివకుమార్,ఎంపీటీసీ రాజ్కుమార్ కు వివరించారు.వారంతా అక్కడికి చేరుకున్నారు.అయిదు బస్తాల్లో బియ్యం నాణ్యంగా లేనట్లు గుర్తించారు.ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పురుగు పట్టినట్లు తేల్చారు.
No comments:
Post a Comment