All meadia

 

Friday, 30 January 2015

ఆనందంగా పని చేస్తే అలసట ఉండదు

తెలంగాణ వెబ్ న్యూస్ ; శ్రద్దతో,ఆనందంగా పని చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని  ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరో  చెప్పారని బలవంతగానో ,బాధతోనో కాకుండా ఆత్మసంతృప్తి  కోసం  పని చేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని ఉద్బోధించారు. రాష్ట్ర మంత్రులు,జడ్పీ అధ్యక్షులు,మేయర్లు,అఖిల భారత స్థాయి అధికారులకు ఈశా ఫౌండేషన్  తరపున సద్గురు జగ్గీవాసుదేవ్ నిర్వహించే మూడు రోజుల శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఫర్ జాయ్ ఫుల్ లివింగ్ పేరిట నిర్వహించే తరగతులను ముఖ్యమంత్రి ఇక్కడి సైబర్ సిటీ కన్వెన్షన్ కేంద్రంలో ప్రారంభించి ప్రసంగించారు.

No comments:

Post a Comment