All meadia

 

Thursday, 29 January 2015

విలువలు నేర్పని పరీక్ష

తెలంగాణ వెబ్ న్యూస్;ఇంటర్మీడియట్ కొత్తగా ప్రవేశ పెట్టిన నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టు పై బుధవారం నిర్వహించిన పబ్లిక్ పరీక్షను అధికారులు మమ అనిపించారు. ఆ పరీక్షకే విలువ లేకుండా పోయింది. చూచిరాతల నడుమ పరీక్ష ముగిసింది.సమాజంలో మానవ  విలువలు మంటకలుస్తున్నాయి.హత్యలు,అఘాయిత్యాలు,మహిళలపై దాడులు జరుగుతున్నాయి. కళాశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు,మానవ  సంబంధాలపై  అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ లో ఓ సబ్జెక్టును ప్రవేశ పెట్టింది.సబ్జెక్టుకు మొత్తం 100 (60 మార్కులు పరీక్షకు, మరో 40 మార్కులు ప్రాజ్టెక్టు పని) మార్కులు కేటాయించింది.బుధవారం నిర్వహించిన పరీక్ష మాత్రం చూచిరాతల నడుమ  కొనసాగింది.
       జిల్లా వ్యాప్తంగా దాదాపు 260 ప్రభుత్వ,ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నైతికత మానవ విలువల పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వం  చెప్పింది మేము నిర్వహించాం అనేలా పరీక్ష కొనసాగింది. విద్యార్థులు పుస్తకాలు చూసి పరీక్ష రాశారు. ఇదో పరీక్షలా కాకుండా  ప్రత్యేక తరగతుల నిర్వహణ మాదిరిగా విద్యార్థులు పక్కపక్కనే  కూర్చొన్నారు. విద్యార్థులకు అర్థం కాక పోతే కొన్ని చోట్ల  అధ్యాపకులే అర్థం కాకపోతే కొన్ని చోట్ల అధ్యాపకులే చెప్పి మరీ రాయించారు. ఈ సందర్భంగా పలువురి విద్యార్థులను  న్యూస్ టుడే పలకరించగా ఈ సబ్జెక్టు గురించి  ఇంతవరకు బోధించలేదు.పరీక్షకు వారం ముందు మాత్రమే అంతంతమాత్రంగా చెప్పారు. అందుకే మేం రాయలేక పోతున్నాం అని చెప్పారు.

No comments:

Post a Comment