తెలంగాణ వెబ్ న్యూస్;నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీచైతన్య టెక్నోస్కూల్ కు చెందిన రెండు బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున నిప్పంటించారు.పాఠశాల ఆవరణలో ఉన్న బస్సుల నుంచి మంటలు చెల రేగడంతో స్థానికులు పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు సమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment