.
Tuesday, 6 January 2015
పట్టపగలు దొంగలు ఓ గృహిణిని బంధించి దోపిడీకి విఫలయత్నం చేశారు. దొంగలు ఇంట్లోకి చొరబడిన సమయంలో ఆమె భర్త రావడంతో కిటికీలో నుంచి బాల్కనీలోకి వెళ్లి రెండో అంతస్థు నుంచి కిందికి దూకారు. ఓ దొంగ పారిపోగా, కాళ్లు విరిగిపోవడంతో నడవలేక మరో దొంగ పట్టుబడ్డాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదులో జరిగింది. సోమాజిగూడ, రాజ్భవన్రోడ్లోని మార్వెల్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ 302 ఫ్లాట్లో సజ్జన్ రాజ్ జైన్, అనితాదేవి దంపతులు నివాసముంటున్నారు. జైన్ స్థానికంగా ఆటో ఫైనాన్స్ సంస్థను నడుపుతున్నారు. మంగళవారం ఆయన ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లగా అనితాదేవి ఒక్కటే ఇంట్లో ఉంది. ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు తట్టడంతో పాటు బెల్ నొక్కారు. అనితాదేవి తలుపు తీయగానే, సార్ పంపించారు...డబ్బులు ఇంట్లో ఇవ్వమని చెప్పారని నమ్మబలికారు. దీంతో ఆమె వారిని లోపలికి రమ్మని చెప్పింది. భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా ఆగంతుకులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. తమతో తెచ్చుకున్న స్ర్పేను ఆమె ముఖంపైన చల్లారు. కాళ్లు,చేతులు కట్టేశారు. ఓ ఆగంతకుడు ఆమె అరవకుండా చేతిని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment