All meadia

 

Friday, 28 August 2015

కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రేవంత్‌రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడం ఖాయమని నల్గొం డ టీడీపీ ఇన్‌చార్జి కంచెర్ల భూపాల్‌ రెడ్డి, పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో ఉంటున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిసేందుకు భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నేతలు గురువారం కొడంగల్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పరామిర్శించారు. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరితో పాటు రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద మంది న్యాయవాదులు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారు.

No comments:

Post a Comment