All meadia

 

Wednesday, 19 August 2015

25న హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎదుట ఆందోళన చేస్తాం : తమ్మినేని

పేదలకు డబుల్‌ బెడ్‌ రూం పథకం ఇంత వరకు అమలు చేయలేదని, దీనిపై ఈ నెల 25న హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎదుట ఆందోళన చేస్తామని తెలంగాణ సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపివేయాలన్నారు. అలాగే పాఠశాలలు, ఆస్పత్రులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అవి అధ్వాన్న స్థితిలో ఉన్నా... కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

No comments:

Post a Comment