All meadia

 

Wednesday, 19 August 2015

డెంగీ మరణాలను పట్టించుకోని ప్రభుత్వం : వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తూ మరణాలు సంభవిస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర్రంలో గత వారం రోజులుగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ, మలేరియా మరణాలు అధికమయ్యాయని, ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. అలాగే... చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చేప్పారు.

No comments:

Post a Comment