ఎన్నికల్లో
ఓటెయ్యడం తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ
రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఓటెయ్యకపోతే వందరూపాయల జరిమానా కూడా
విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. వంద శాతం ఓటింగ్
సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రజాస్వామ్యంలో ఓటు వేయకపోవడం సరైంది కాదనేది గుజరాత్ ప్రభుత్వ వాదన.
అందుకే కంపల్సరీ ఓటింగ్ చట్టం తీసుకొచ్చింది. అయితే దీనిపై గుజరాత్
హైకోర్టు ప్రస్తుతానికి స్టే విధించింది.
No comments:
Post a Comment