జిల్లాలోని వంగర మండలం
అన్నారంలో ప్రజా సమస్యలను పరిష్కరించమన్న గ్రామస్థులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే
గువ్వల బాలరాజ్ అనుచరులు చేయి చేసుకున్నారు. జిల్లాలో నిర్వహించిన
గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాసమస్యలపై ఇద్దరు వికలాంగులు ఎమ్మెల్యేను
నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు వికలాంగులపై
చేయిచేసుకున్నారు. ఇందుకు నిరసనగా గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
No comments:
Post a Comment