ఇదేదో రేషన్ కోసమో..
కిరోసిన్ కోసమో కట్టిన క్యూ కాదు.. మరి ఎందుకని అంటా రా!? రూ.20కే
ఉల్లిగడ్డల కోసం..! రైతుబజార్ల వద్ద నెలకొన్న దుస్థితి ఇది. జిల్లా
బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65కి లభిస్తుండడంతో.. సామాన్యులు
ప్రభుత్వం స బ్సిడీ ద్వారా రూ.20కి కిలో ఉల్లి గడ్డల కోసం గంటల తరబడి
బారులు తీరుతున్నారు. గురువారం నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద
రైతుబజార్లో ఉల్లి గడ్డల కోసం కొనుగోలుదారులు ఏకంగా 3గంటల పాటు క్యూలో
వేచి ఉన్నారిలా..
No comments:
Post a Comment