నియోజకవర్గ అభివృద్ధికి
ఎంపీ కేశినేని నాని చేస్తున్న కృషి ఫలించింది. విజయవాడ పార్లమెంట్
పరిధిలోని 254 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్ట్ ప్రణాళికను రూపొందించిందని
కేశినేని నాని తెలిపారు. ఈనెల 24న ఈ ప్రణాళికను ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్టాటా విడుదల చేస్తారని నాని
చెప్పారు. దేశంలోనే తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టాటా
ట్రస్ట్ దత్తత తీసుకుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23న రతన్టాటా
విజయవాడ రానున్నారు. అనంతరం ఆయన చంద్రబాబుతో సమావేశం అవుతారు.
No comments:
Post a Comment