ప్రాణహిత-చేవెళ్ల
డిజైన్ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి
దయాకర్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో
మాట్లాడుతూ... ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే సీఎం
కేసీఆర్ ఏ ఫాంహౌస్లో నిద్రపోతున్నారంటూ ఆయన విమర్శించారు. పూర్తిగా కరువు
కాటకాల్లో ఉండే వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్ఘన్పూర్కు దేవాదుల
ప్రాజెక్టు వల్లే నీరు వస్తున్నాయని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చితే
ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావుకు మతి
భ్రమించిందని, టీఆర్ఎప్ నేతలకు వారి వారి భార్యలు అన్నం పెట్టకపోయినా...
దానికి టీడీపీనే కారణం అనేట్లుగా ఉన్నారని ఆయన ఛలోక్తులు విసిరారు.
No comments:
Post a Comment