ఆంధ్రాలో
త్వరలో ఆర్టీసీ చార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈమేరకు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చార్జీల పెంపు ప్రతిపాదనలు వెళ్లాయి.
ఆయన నిర్ణయం కోసం ఆర్టీసీ సంస్థ ఎదురుచూస్తోంది. ఈ విషయాలను ఆర్టీసీ ఎండీ
సాంబశివరావు వెల్లడించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ...
స్వల్పంగా చార్జీలు పెంచాలని మూడు ప్రతిపాదనలను సీఎం వద్దకు పంపామన్నారు.
అయితే.. గత ఏడాదితో పోలిస్తే 85 శాతం నష్టాలు తగ్గాయని, ఈ ఏడాది
త్రైమాసికంలో రూ. 25 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. డీజిల్ రేటు తగ్గడం
వల్ల రూ. 65 కోట్లు, అంతర్గత సామర్థ్యం పెంపు వల్ల రూ. 70 కోట్ల నష్టం
తగ్గిందన్నారు. ఇక ఇటీవల ప్రకటించిన ఫిట్మెంట్ వల్ల నెలకు రూ. 55 కోట్ల
మేర అదనపు భారం పడుతోందన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి విజయవాడ
కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగుతాయని, డిసెంబర్ 20లోగా పూర్తిస్థాయిలో
ఉద్యోగుల తరలింపు జరుగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment