యెస్ మార్ట్ బంపర్ డ్రా విజేతలను ఎంపిక చేసిన యువసామ్రాట్ తనయుడు అఖిల్ అక్కినేని



తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; యేస్ మార్ట్ మొబైల్ షోరూం ఆధ్వర్యంలో దసరా దీపావళి సందర్బంగా శుక్రవారం ట్యాంక్ బండ్ లోని హోటల్ మారియంట్ లో బంపర్ డ్రా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బంపర్ డ్రా కార్యక్రమానికి అక్కినేని నాగార్జున కుమారుడు నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ఎంపిక చేశారు. హైదారాబాద్ లోని ఎలక్టానిక్స్, మొబైల్స్ మరియు హోం అప్లయన్సెస్ రిటైల్ రంగంలో తమ సృజనాత్మక ఆఫర్లు, అగ్రశ్రేణి బ్రాండ్ల నుంచీ విస్తృత శ్రేణి ఉత్పత్తులు, పరిశ్రమలో ఎన్నో మొదటి ఆవిష్కరణలు, అత్యున్నత సేవల ద్వారా పూర్తి మార్పు తేవడానికి యెస్ మార్ట్ ప్రయత్నిస్తుందని నిర్వాహకులు అన్నారు. ఎలక్ట్రానిక్ రిటైల్ విభాగంలో పవర్ బ్రాండ్స్ రైజింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకుందని వివరించారు. వందల బ్రాండ్లకు సంబంధించిన వేల ఉత్పత్తులతో యెస్ మార్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని తెలిపారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, మొబైల్స్, మైక్రో ఓవెన్లు, లాప్ టాప్ లు, కెమెరాలు, గీజర్లు, హెయిర్ డ్రయ్యర్లు, మిక్సర్లు ఇంకా ఎన్నో ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక చోట ఉండే ప్రదేశం యెస్ మార్ట్. వినియోగ దారులే లక్ష్యంగా యెస్ మార్ట్ పని చేస్తుందన్నారు. యేస్ మార్ట్ సీఈవో నీలిమ, ఎండి రవికుమార్ ఉద్యోగులతో కలిసి యేస్ యేస్ మార్ట్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు సినిమా తారలతో పాటు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment