- 10,300 బస్సులతో దేశంలోనే మూడవ అతి పెద్ద రవాణ సంస్థగా తెలంగాణ ఆర్ టిసి
- 90 లక్షల మంది ప్రయాణీకులకు ఆర్టీసీ సేవలు అందిస్తుంది....
- సమావేశంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, బండారు దత్తాత్రేయ....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్...ఆర్ టి సి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా కొనుగోలు చేసిన 80 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ 10,300 బస్సులతో దేశంలోనే మూడవ అతి పెద్ద రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీ గా పేరుందన్నారు. ఆర్టీసీ 90 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment