తెలంగాణ వెబ్ న్యూస్;తిరుపతి ఎన్ కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.మృతుల ఫోటోలు విడుదల చేసి బంధువులకు సమాచారం అందించాలని సీఎం ఈ సందర్భంగా అధికారలకు సూచించారు.అలాగే ఎర్ర చందనం స్మగ్లర్ల ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.ఘటన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు తిరుపతి ఎన్ కౌంటర్ సంఘటనపై గవర్నర్ నరసింహన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో వివరించారు.అంతకు ముందు డీజీపీ జేవీ రాముడు..చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment