జవహర్నగర్ గణేష్ మండపంలో ఎంఐఎం నేత నవీన్యాదవ్ను సన్మానిస్తున్న ఉత్సవ కమిటి నాయకుడు
తెలంగాణ వెబ్న్యూస్, హైదరాబాద్ : వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్లో జైభవానీమాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానికి గణేస్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎంఐఎం నాయకుడు నవీన్యాదవ్, స్థానిక కార్పొరేటర్ శ్యామ్ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటి నాయకులు నవీన్యాదవ్, శ్యామ్ముదిరాజ్ను శాలువాతో సన్మానించారు. కార్య క్రమంలో నాయకులు రామకృష్ణ, నాగరాజుయాదవ్, దామోదర్, శివకుమార్, రవికుమార్, రామ్కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్....
rcnjournalism@gmail.com
9392641999
No comments:
Post a Comment