రాజ్ భవన్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో గవర్నర్ నరసింహన్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్.... విడిపోయిన తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడిచేలా కలిసి మెలసి పని చేద్దామని తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడులు అన్నారు. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామన్నారు. ఇక అభివృద్ధిలో పోటి పడదామన్నారు. ఇందుమూలంగా గవర్నర్ మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రుల సమర్థులే.... ఇద్దరు ముఖ్యమంత్రుల భేటి శుభ పరిణామం అన్నారు. రెండు రాష్ట్రాలకు సమర్థులైన ముఖ్యమంత్రులు దొరికారన్నారు. ఇద్దరూ కలిసి పని చేసి రెండు రాష్ట్రాలను దేశానికి మార్గదర్శకంగా తీర్చిదిద్దాలన్నారు.
No comments:
Post a Comment